అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల దుబాయ్లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో శ్రీజ ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ స్కైలైన్ ఉదయ సూర్యోదయ కాంతుల్లో కనిపిస్తూ యూఏఈ జెండా ఎగురుతోంది. ఆ చిత్రంపై వి చూజ్ దిస్ కంట్రీ, అండ్ వి స్టాండ్ విత్ ఇట్ అనే సందేశం ఉంది. మరో స్టోరీలో ఆమె ఇలా రాశారు. ప్రతి కాల్, ప్రతి మెసేజ్కు ఎంతో కృతజ్ఞతలు. మీ ప్రేమ ఎంతో విలువైనది. మేము ఇక్కడ దుబాయ్లో సురక్షితంగా ఉన్నాం, బాగా రక్షించబడ్డాం. శాంతి, ప్రశాంతత కోసం ప్రార్థనలు.. అని పేర్కొన్నారు. శ్రీజ ప్రస్తుతం తన కుమార్తెలు నివ్రుతి, నవిష్కాతో యూఏఈలో నివసిస్తున్నారు.
కాగా ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ప్రముఖుల్లో తమిళ నటుడు అజిత్ కుమార్, మంచు విష్ణు, సోనాల్ చౌహాన్, ఈషా గుప్తా కూడా ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28న విష్ణు దుబాయ్ ఆకాశంలో క్షిపణులు కనిపిస్తున్న వీడియోను పంచుకున్నారు. ఇంటర్సెప్షన్ శబ్దాలతో తన కుమార్తె ఆయ్రా భయపడిందని వెల్లడించారు. యూఏఈ రక్షణ దళాలకు పౌరుల భద్రత కోసం కృతజ్ఞతలు తెలిపారు.
ఇక శ్రీజ కొనిదెల చిరంజీవి-సురేఖ దంపతుల చిన్న కుమార్తె. 2007లో తన కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా శిరీష్ భరద్వాజ్ను వివాహం చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు. 2008లో వారికి నివ్రుతి జన్మించింది. 2014లో వివాహబంధం విరమించుకున్నారు. 2024లో శిరీష్ ఆరోగ్య సమస్యలతో మరణించారు. 2016లో తన బాల్యస్నేహితుడు కళ్యాణ్ దేవ్ను శ్రీజ వివాహం చేసుకున్నారు. 2018లో నవిష్కా జన్మించింది. అనంతరం 2022లో వీరు విడిపోయారు. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తమ భద్రతపై స్పష్టతనిస్తూ అభిమానులకు ధైర్యం ఇస్తున్నారు.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…