శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెకెలెలో పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో చివరి ఓవర్లలో శనక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఓ దశలో శనక బాదుడుకు శ్రీలంక గెలుస్తుందని కూడా భావించారు. చివరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సిన అవసరం ఉండగా పాక్ బౌలర్ షహీన్ షా అఫ్రిది బౌలింగ్కు దిగాడు. ఈ క్రమంలో అఫ్రిది వేసిన చివరి ఓవర్ తొలి బంతిని శనక ఫోర్ కొట్టాడు. ఆ తరువాత వరుసగా మూడు బంతులకు మూడు సిక్సర్లు బాదాడు. అయితే చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో 5వ బంతిని అఫ్రిది ఆఫ్ స్టంప్ అవతలకు దూరంగా యార్కర్ మాదిరిగా విసిరాడు. దాన్ని ఆడడంలో శనక విఫలం అయ్యాడు. తరువాత కూడా అలాంటి బంతినే వేయగా శనక అది వైడ్ అనుకుని వదిలేశాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీంతో శ్రీలంకపై పాక్ 5 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న సమయంలో డోర్ వద్ద శనకను ఆపిన మలింగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు. శనకపై కోపంతో మలింగ ఏదో అన్నట్లు వీడియోలో కనిపించింది. అయితే చివరి రెండు బంతులను ఎందుకు వదిలేశావనే అతనిపై మలింగ అరిచి ఉంటారని తెలుస్తోంది.
వాస్తవానికి 5వ బంతిని సాధారణ షాట్ ఆడి ఉంటే అది కూడా బౌండరీకి వెళ్లి ఉండేది. కానీ శనక స్కూప్ షాట్కు యత్నించాడు. అది ఫెయిల్ అయింది. దీంతో చివరి బంతికి కచ్చితంగా సిక్స్ కొట్టాల్సి వచ్చింది. ఇక అఫ్రిది ఆ బంతిని ఆఫ్ స్టంప్కు దూరంగా యార్కర్ లెంగ్త్లో బౌల్ చేశాడు. అయితే రీప్లేలో బంతి వైడ్ అని స్పష్టంగా తేలింది. అయినప్పటికీ అంపైర్ వైడ్ కాదని ఇవ్వడంతో శనక చేసేదేం లేక విచారం వ్యక్తం చేశాడు. కానీ అంతకు ముందు స్కూప్ షాట్కు యత్నించకుండా షాట్ అడి ఉంటే శ్రీలంక కచ్చితంగా గెలిచి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో కామెంటేటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అంత వరకు వచ్చి మ్యాచ్ గెలవకపోవడంతో ఆ కోపంలోనే శనకపై మలింగ అరిచి ఉంటారని అంటున్నారు.
ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 212 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ బ్యాటర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీతో కదం తొక్కగా, మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ కూడా 84 పరుగులతో రాణించాడు. కానీ ఆ తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ ఆ ఊపును కొనసాగించలేదు. అయితే సెమీ ఫైనల్కు అర్హత సాధించాలంటే పాక్కు ఈ మ్యాచ్లో శ్రీలంకను 20 ఓవర్లలో 147 పరుగులకే కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మ్యాచ్లో కాసేపు పాక్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు కూడా. కానీ శ్రీలంక కెప్టెన్ దసున్ శనక 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ పవన్ రతనాయకె కూడా 58 పరుగులతో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. కానీ చివరి ఓవర్లో శనక అలా ఆడడంతో అక్కడి వరకు వచ్చి కూడా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం శనక కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ గ్రూప్లో ఇప్పటికే ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధించగా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఎలిమినేట్ అయ్యాయి.
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…