యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య రాకూడదని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకునే వారి కారణంగా ఎవరికీ నష్టం జరగకుండా ఉండాలని, త్వరలోనే ఇది ముగిసి అందరి ప్రాణాలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం యూఏఈలో ఉన్నానని తెలిపిన లారాదత్తా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, యూఏఈ ప్రభుత్వం ఏం చేస్తుంది తదితర వివరాలపై మాట్లాడారు.
యూఏఈకి తాను ఓ బ్రాండ్ ప్రమోషన్పై వచ్చానని లారా దత్తా వీడియోలో వివరించారు. తాను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నానని, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన తాను స్టూడియోలో ఉండగా బయటి నుంచి భారీ విస్ఫోటన శబ్దాలు వినిపించాయని, వెంటనే భయంతో బయటకు పరుగెత్తి చూస్తే మిస్సైల్స్ను అడ్డుకుని ఆకాశంలోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయని అన్నారు. ఆ సమయంలో చాలా భయం కలిగిందని, తన కుమార్తె సైరా భూపతి కూడా తనతోనే ఉందని, కానీ భర్త మహేష్ భూపతి దుబాయ్ లో లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నానని తెలిపారు.
దుబాయ్లో తాము ఓ కమ్యూనిటీలో విల్లాలో సురక్షితంగా ఉన్నామని లారాదత్తా తెలిపారు. కానీ రోజూ ఫైటర్ జెట్స్, బాంబుల పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, అత్యంత ఆందోళకర వాతావరణం నెలకొందని చెప్పారు. శబ్దాల కారణంగా కిటికీలు షేక్ అవుతున్నాయని, డోర్లు దడదడా కొట్టుకుంటున్నాయని దీంతో క్షణ క్షణం ఆందోళనగా ఉందని అన్నారు. అయినప్పటికీ తమకు సురక్షితంగానే ఉన్నామన్న భావన ఉందని, యూఏఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని, తమ పౌరులను రక్షించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని కితాబిచ్చారు. ఏ దేశానికి చెందిన వారైనా సరే యూఏఈ ప్రభుత్వం తమ సొంత పౌరులుగా చూస్తుందని, ఇది తనకు ఎంతో సురక్షితంగా ఉన్నామన్న భావనను కలిగిస్తుందని అన్నారు.
ఓ వైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ దుబాయ్లో ప్రస్తుతం ప్రజల రోజువారి జీవన విధానం సాధారణంగానే ఉందని, ప్రజలు మళ్లీ యథావిధిగా తమ రోజువారి కార్యకలపాలను నిర్వహిస్తున్నారని లారాదత్తా తెలిపారు. జనజీవనం అంతా సాధారణంగానే ఉందని, ప్రజలు రోజూలాగే తమ పనులను తాము చేసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం ముంబై చేరుకునేందుకు తాను విమాన సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే ఇండియాకు రీచ్ అయి మళ్లీ ఫ్యామిలీతో కలుస్తానని తెలిపారు. కాగా యూఏఈలో ఉన్న సోనాల్ చౌహాన్, ఈషా గుప్తా, పీవీ సింధు తదితరులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇంకా చాలా మంది సెలబ్రిటీలు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజలందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఒక్కటే, యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అని. దానికి కాలమే సమాధానం చెబుతుంది.
సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బంపర్ న్యూస్. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ను…
నటుడు సోనూసూద్ మరోమారు దాతృత్వం చాటుకున్నారు. కోవిడ్-19 సంక్షోభం సమయంలో, పంజాబ్ లో వరదలప్పుడు ఆయన ఎంతో మందికి సహాయం…
తనకు కమ్ఫర్ట్ జోన్లో ఉండడం అలవాటు లేదని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తానని, ప్లాన్ చేసినవి జరగడం లేదని,…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్…
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన…
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా…
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా…