బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుని తీర్చుకునేందుకు ఆమె అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి తిరుమల కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం (మార్చి 5, 2026) రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ప్రయాణం ప్రారంభించిన జాన్వీ శుక్రవారం (మార్చి 6, 2026) ఉదయం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం సుమారు 11 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 3,500కు పైగా మెట్లు ఉంటాయి. భక్తులు విశ్వాసంతో ఈ మెట్ల మార్గాన్ని ఎక్కుతూ తిరుమల చేరుతారు. ఆమెకు ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు ఆమెకు పవిత్ర తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జాన్వీ కపూర్ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యమైన సందర్భాల్లో ఆమె తరచూ తిరుమలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవి జయంతి వంటి సందర్భాల్లో కూడా ఆలయాన్ని సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. తన సినిమాల కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు వాటి స్క్రిప్ట్ను కూడా తిరుమలకు తీసుకెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటానని జాన్వీ గతంలో ఇంటర్వ్యూలలో వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో జాన్వీ కపూర్ సాదాసీదా తెల్లటి కుర్తా ధరించి, చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని అలిపిరి మెట్లను ఎక్కుతున్నట్లు కనిపించింది. ఆమెతో పాటు ఒకప్పుడు ప్రముఖ నటి అయిన మహేశ్వరి కూడా అలిపిరిలో కాలి నడకన వెళ్లారు.
తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి కాలినడకన కొండపైకి చేరుకున్న జాన్వీ, రాత్రంతా తిరుమలలోనే ఉండి ఉదయం స్వామివారి దర్శనం పొందారు. గత సంవత్సరం తన 27వ పుట్టినరోజు సందర్భంగా కూడా జాన్వీ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె సన్నిహితుడు శిఖర్ పహారియా, స్నేహితుడు ఓరీ ఉన్నారు. ఆ సమయంలో జాన్వీ గులాబీ రంగు చీరలో కనిపించగా, శిఖర్, ఓరీ తెల్లటి వెష్టీల్లో కనిపించారు. ఆలయ ప్రాంగణంలో వారు కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీ, శిఖర్ తరచూ కలిసి రెస్టారెంట్లు, ఈవెంట్లలో కనిపిస్తుంటారు.
గతంలో టాక్ షో కాఫీ విత్ కరణ్లో జాన్వీ మాట్లాడుతూ శిఖర్ తనకు మాత్రమే కాకుండా తన కుటుంబానికి కూడా ఎంతో దగ్గరైన వ్యక్తి అని చెప్పారు. అతను ఎలాంటి స్వార్థం లేకుండా ఎప్పుడూ తనకు అండగా నిలిచాడని పేర్కొన్నారు. ఇక జాన్వీ కపూర్ చివరిసారిగా ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…