‘నన్నెందుకు పిలవలేదు?’.. చిన్నారి ప్రశ్నకు విజయ్-రష్మిక అదిరిపోయే రిప్లై!

టాలీవుడ్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొంండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహం చేసుకున్న నేప‌థ్యంలో ఓ చిన్నారి సోష‌ల్ మీడియాలో వారిని ఓ ప్ర‌శ్న అడిగింది. తాను కూడా వారి అభిమానినే అని, త‌నను పెళ్లికి ఎందుకు ఆహ్వానించ‌లేద‌ని ప్ర‌శ్నించింది.

March 8, 2026 8:34 AM
Vijay Deverakonda and Rashmika Mandanna replying to a young fan's viral video.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నారి వీడియోపై స్పందించిన ‘విరోష్’ జంట. Photo Credit: Rashmika Mandanna/Instagram.

టాలీవుడ్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొంండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహం చేసుకున్న నేప‌థ్యంలో ఓ చిన్నారి సోష‌ల్ మీడియాలో వారిని ఓ ప్ర‌శ్న అడిగింది. తాను కూడా వారి అభిమానినే అని, త‌నను పెళ్లికి ఎందుకు ఆహ్వానించ‌లేద‌ని ప్ర‌శ్నించింది. ఈ మేర‌కు ఆమె మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే అది ఆ న‌టుల దృష్టికి కూడా చేరింది. దీంతో వారు ఆ చిన్నారికి రిప్లై ఇచ్చారు. ఆ వీడియోకు స్పందించిన విజయ్ కామెంట్ సెక్షన్‌లో ఇలా రాశారు. బుజ్జితల్లి.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ ఏమిటో చెప్పు. అన్నీ ఇంట్లో చేయించి మనం కలిసి బాగా తిందాం.. అని విజ‌య్ అన్నారు. అలాగే ఈ వీడియోను రష్మిక మందన్నా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుని ఆ చిన్నారికి ప్రత్యేక బహుమతి ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్‌గా మారింది. కాగా విజ‌య్‌, ర‌ష్మికల వివాహం ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌య్‌పూర్‌లో అట్ట‌హాసంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అభిమానుల‌కు స్వీట్ల పంపిణీ..

రష్మిక మందన్న‌, విజయ్ దేవరకొండ ఉదయ్‌పూర్‌లో జరిగిన అట్టహాసమైన, ఆత్మీయమైన వివాహ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ పెళ్లి అనంతరం ఈ జంట అభిమానులకు ప్రత్యేకంగా మిఠాయిల బాక్సులను పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలోని పలు నగరాలు, దేవాలయాలకు మిఠాయిలను పంపిస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరారు. అదనంగా తమ సినీ పరిశ్రమ స్నేహితుల కోసం ఇటీవ‌లే హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు కూడా నిర్వ‌హించారు. రష్మిక మందన్న‌, విజయ్ దేవరకొండ వివాహానికి సంబంధించి, పెళ్లి తర్వాత ఈ జంట ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా అభిమానులతో ఆనందాన్ని పంచుకోవడానికి ప్రేమతో నిండిన మిఠాయిల ట్రక్కులను పంపిస్తామని వారు తెలిపారు. ఈ మిఠాయిలను ఢిల్లీ, బిహార్, తెలంగాణ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి నగరాల్లో పంపిణీ చేశారు.

ఆల‌యాల్లో అన్న‌దానం..

అదే సమయంలో కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న రష్మిక, విజయ్ గత సంవత్సరం అక్టోబర్‌లో ఆత్మీయంగా జరిగిన ఒక కార్యక్రమంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఫిబ్రవరిలో అధికారికంగా పెళ్లి ప్రకటన చేసే వరకు తమ సంబంధం లేదా నిశ్చితార్థం గురించి ఈ జంట బహిరంగంగా ఎప్పుడూ వెల్లడించలేదు. కొత్తగా పెళ్లైన ఈ జంట మార్చి 4న హైదరాబాద్‌లో వివాహ విందును ఏర్పాటు చేశారు. ఆ వేడుకలో ఇద్దరూ సంప్రదాయ దక్షిణ భారత దుస్తుల్లో ఆకట్టుకున్నారు. విజయ్ క్రీమ్ రంగు కుర్తా, ధోతీ ధరించగా, రష్మిక ఎరుపు, బంగారు రంగు చీరలో మెరిసిపోయింది. ఆమె భారీ బంగారు ఆభరణాలు, సింధూరంతో అందంగా కనిపించింది.

ఈ సంద‌ర్భంగా విజ‌య్‌ మీడియాతో మాట్లాడుతూ ఈరోజుతో ఈ వేడుకలను ముగించుకుని మేం కొంచెం నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటున్నాం.. అని అన్నారు. విజ‌య్ మాటల‌కు రష్మిక నవ్వుతుండగా, అక్కడున్న ఫోటోగ్రాఫర్లు కూడా ఆ వ్యాఖ్యల‌తో నవ్వుల్లో మునిగిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment