tollywood news
అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో విలాసవంతమైన కానుకతో తన తల్లి నిర్మల అల్లును సర్ప్రైజ్ చేశారు.
బెల్లంకొండ ఇంట్లో పెళ్లి సందడి.. వైభవంగా శ్రీనివాస్ నిశ్చితార్థం..
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి 8, 2026) హైదరాబాద్లో జరిగింది. ఇటీవల టాలీవుడ్ హీరోలు ఒకరి తరువాత ఒకరు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్.. బర్త్ డే వేళ శ్రీవారి సేవలో ‘దేవర’ బ్యూటీ!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుని తీర్చుకునేందుకు ఆమె అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి తిరుమల కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బంపర్ న్యూస్. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయ్-రష్మిక ఉదారత.. 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రకటన!
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా ప్రకటనతో ముందుకొచ్చారు. మార్చి 4న హైదరాబాద్లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్కు ముందు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.
మేమంతా క్షేమం.. దుబాయ్లో శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల దుబాయ్లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు.
మంచు విష్ణు ఫ్యామిలీ కోసం లక్ష్మి ఆందోళన.. దుబాయ్లో ఏం జరుగుతోంది?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో భావోద్వేగ మెసేజ్ను పోస్టు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు.















