Cricket News
అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్లో చోటు దక్కేనా?
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ సెమీస్లో వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షణ!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ను ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో ఒకేసారి గరిష్టంగా 6.52 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఈవెంట్లలో అత్యధిక డిజిటల్ పీక్ కన్కరెన్సీగా నమోదు అయింది.
టీ20 వరల్డ్ కప్ 2026 సరికొత్త రికార్డ్.. 50 కోట్ల వ్యూయర్షిప్తో జైషా సంచలన పోస్ట్!
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్ కప్ల వ్యూయర్షిప్ రికార్డులను బ్రేక్ చేసిందని ఐసీసీ చైర్మన్ జైషా అన్నారు.
ఇంగ్లండ్ను కొట్టాలంటే అది కావాల్సిందే.. సంజు శాంసన్పై గంభీర్ ప్రశంసల జల్లు!
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో గంభీర్ తమ తదుపరి మ్యాచ్ గురించి వివరాలను వెల్లడించారు.
శనకపై మలింగ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద హైడ్రామా! పాక్తో మ్యాచ్ తర్వాత అసలేం జరిగింది?
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెకెలెలో పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో చివరి ఓవర్లలో శనక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఓ దశలో శనక బాదుడుకు శ్రీలంక గెలుస్తుందని కూడా భావించారు.
ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వరకు జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.
ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను తెలుసుకుని ఇకపై అలా జరగకుండా చూసే అవకాశం లభించిందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి అన్నారు.
బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్.. టీమిండియాపై గవాస్కర్ ఫైర్!
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం కాదని క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాలవడంపై గవాస్కర్ స్పందించారు.
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. సోఫీ షైన్తో కొత్త జీవితం ప్రారంభం!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ను వివాహం చేసుకున్నాడు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) జరిగిన ఓ ప్రైవేటు వివాహ కార్యక్రమంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరు గతేడాది నుంచి రిలేషన్షిప్లో ఉండగా ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
3 మ్యాచ్లు.. 3 డకౌట్లు: విమర్శలపై నోరు విప్పిన అభిషేక్ శర్మ!
టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో నమోదు చేయలేదు. యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లలో వరుసగా డకౌట్ అయ్యాడు.

















