Cricket News Telugu
2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ మనసులో ఏముందంటే!
భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా వెల్లడించారు. ఈ మెగా టోర్నీ సౌతాఫ్రికాలో జరగనుంది. 50 ఓవర్ల వరల్డ్ కప్ తనకు ఎప్పటి నుంచో అత్యంత ప్రాధాన్యమున్న ట్రోఫీ అని ఆయన పేర్కొన్నారు.
టీమ్ ఇండియాకు గంభీర్ స్పెషల్ డిన్నర్.. నమీబియాతో పోరుకు ముందు అదిరిపోయే ప్లాన్!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా తన తరువాతి మ్యాచ్లో నమీబియాతో తలపడనుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు.
సూర్య ఇన్నింగ్స్కు సెహ్వాగ్ ఫిదా.. టీమిండియా స్టార్పై ప్రశంసల జల్లు!
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ను మాజీ భారత ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలతో ముంచెత్తారు.
భారత్తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్లో ఉత్కంఠ.
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్ ఎ మ్యాచ్ను ఆడబోమన్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం ఏకాభిప్రాయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2026: భారత్ ‘అత్యంత ప్రమాదకరమైన జట్టు’.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు.












