ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేసవిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అలరించేందుకు సిద్ధమవుతోంది. కరోనా వల్ల గతేడాది వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ 13వ ఎడిషన్ను వాయిదా వేసి సెప్టెంబర్ – నవంబర్ నెలల మధ్య దుబాయ్లో నిర్వహించారు. ఇక ఈసారి 14వ ఎడిషన్ను భారత్లోనే నిర్వహిస్తున్నారు. కాకపోతే ప్రేక్షకులు లేకుండానే ఈసారి ఐపీఎల్ జరగనుంది. ఈ క్రమంలో జట్లన్నీ ఇప్పటికే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చాలా రోజుల తరువాత తమ జట్టు ఆటగాళ్ల జెర్సీ లుక్ను మార్చింది. జెర్సీపై కొత్త కంపెనీలకు చెందిన స్పాన్సర్షిప్ లోగోలతోపాటు జెర్సీ భుజాలపై ఇండియన్ ఆర్మీ యూనిఫాంను ప్రతిబింబించే విధంగా డిజైన్ చేశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లోగోపై 3 స్టార్స్ను ఏర్పాటు చేశారు. అయితే ఆ స్టార్స్ ఏమిటా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అందులో పెద్ద విషయం ఏమీ లేదు. చెన్నై ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలిచింది కదా. 2010, 2011, 2018లలో ఐపీఎల్ను గెలుచుకుంది. దీంతో ఆ విజయాలను ప్రతిబింబించేలా ఆ 3 స్టార్స్ను లోగోలపై డిజైన్ చేశారు.
ఇక గత సీజన్లో చెన్నై టీమ్ చెత్త ప్రదర్శన చూపింది. మొత్తం 14 మ్యాచ్లలో కేవలం 6 మ్యాచ్లను మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా తప్పుకోవడం జట్టుకు మైనస్ అయింది. అయితే ఈసారి మాత్రం చెన్నై టీమ్ మునుపటిలా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారు ఆశిస్తున్నట్లు జరుగుతుందా, లేదా ? అన్నది చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…