SPG Commando : ప్ర‌ధాని మోదీకి సెక్యూరిటీ క‌ల్పించే ఒక్కో ఎస్‌పీజీ క‌మాండోకు జీతం ఎంత ఉంటుందో తెలుసా ?

SPG Commando : గ‌త కొద్ది రోజులుగా ప్ర‌ధాని మోదీ భ‌ద్ర‌త‌పై అనేక వివాదాలు నెల‌కొంటున్న విష‌యం విదిత‌మే. పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోదీ వెళ్లిన‌ప్పుడు ఆయ‌న అక్క‌డి ఓ ఫ్లై ఓవ‌ర్‌పై 20 నిమిషాల పాటు ఆగిపోయారు. అదే ర‌హ‌దారికి కొద్ది దూరంలో రైతులు నిర‌స‌న తెలియ‌జేస్తుండ‌డంతో భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల మోదీ ముందుకు కొన‌సాగ‌లేక టూర్‌ను ర‌ద్దు చేసుకుని తిరిగి వెన‌క్కి వెళ్లిపోయారు. అయితే ఈ విష‌యం వివాదంగా మారింది.

పంజాబ్ ప్ర‌భుత్వం మోదీకి భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డంలో విఫ‌లమైందంటూ ఇప్ప‌టికే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్న‌త స్థాయి అధికారుల విచార‌ణ న‌డుస్తోంది. దీంతోపాటు సుప్రీం కోర్టులోనూ కేసు న‌డుస్తోంది. అయితే ప్ర‌ధానికి ర‌క్ష‌ణ క‌ల్పించే ఎస్‌పీజీ క‌మాండోల గురించి అంద‌రికీ తెలుసు. ఈ వ్య‌వ‌స్థ‌ను స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ అంటారు. అప్ప‌ట్లో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఆమె భ‌ద్ర‌త అధికారులే ఆమెను కాల్చి చంపారు. దీంతో అప్ప‌టి నుంచి ప్ర‌ధాని భ‌ద్ర‌త బాధ్య‌త‌ల‌ను ఎస్‌పీజీయే ప‌ర్య‌వేక్షిస్తోంది. ఇందిరా గాంధీ హ‌త్య త‌రువాతే ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు.

ఇక ఎస్‌పీజీలో ప‌నిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఏమీ ఉండ‌దు. ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపీఎస్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌), బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)ల‌కు చెందిన సీనియ‌ర్‌, జూనియ‌ర్ ఆఫీస‌ర్ల‌ను ఎస్‌పీజీలోకి తీసుకుంటారు. వారికి రాటుదేలేలా శిక్ష‌ణను అందించి త‌రువాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఎస్‌పీజీలో 3వేల మందికి పైగా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

ఇక ఒక్కో ఎస్‌పీజీ అధికారి కేవ‌లం ఒక ఏడాది పాటు మాత్రమే విధి నిర్వ‌హ‌ణ‌లో ఉంటాడు. త‌రువాత మార్చేస్తారు. ఎస్‌పీజీలో ఒక ఏడాదిపాటు ప‌నిచేశాక ఇత‌ర విభాగాల‌కు మారుస్తారు. ఎస్‌పీజీలో ప‌నిచేయ‌డం అంటే ప్ర‌ధాని మోదీకి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సి ఉంటుంది. క‌నుక చాలా మెరిక‌లైన క‌మాండోల‌నే అందుకు నియ‌మిస్తారు. ఎటు వైపు నుంచి ఆప‌ద వ‌చ్చినా ఇట్టే ప‌సిగ‌ట్టి ప్ర‌ధాని ప్రాణాల‌ను ర‌క్షించేందుకు వీరు ప్ర‌తి క్ష‌ణం సిద్ధంగా ఉంటారు.

ఎస్‌పీజీ క‌మాండోలు ప్రధానితోపాటు ఆయ‌న ఇల్లు, కుటుంబ స‌భ్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తారు. ఒక్కో ఎస్‌పీజీ క‌మాండోకు ఎప్పుడూ ఒక‌టే డ్యూటీ ఉండ‌దు. త‌ర‌చూ మారుస్తుంటారు. ఇక వీరి వేత‌నం విష‌యానికి వ‌స్తే వీరికి అన్ని ర‌కాల అల‌వెన్స్‌లు క‌లిపి నెల‌కు రూ.84వేల నుంచి రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం ఉంటుంది. బోన‌స్ , ఇత‌ర అల‌వెన్స్‌లు, స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తారు. వీరికి డ్రెస్ అల‌వెన్స్ కింద ఏడాదికి రూ.27,800 ఇస్తారు. ఇలా ఎస్‌పీజీ క‌మాండోలు ప‌నిచేస్తుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM