Siddharth : నటుడు సిద్ధార్థ ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. మొన్నా మధ్య సమంత విడాకుల ప్రకటన అనంతరం సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇక తాజాగా బ్యాడ్మింటన్ చాంపియన్ సైనా నెహ్వాల్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఎట్టకేలకు సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెబుతూ.. ఈ వివాదానికి ఇక చెక్ పెట్టేశాడు.
సైనా నెహ్వాల్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ అభ్యంతరకర పదాలను వాడుతూ ట్వీట్ చేశాడు. దీంతో అతనిపై నెటిజన్లే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే తాను కేవలం జోక్ చేశానని, దాన్ని డబుల్ మీనింగ్లో తీసుకుంటే తప్పు తనది కాదని అన్నాడు. కానీ అతనిపై వస్తున్న విమర్శలు ఏమాత్రం తగ్గలేదు. ఓ వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. దీంతో ఈ వివాదాన్ని ఇంకా చిలికి చిలికి గాలి వాన చేయడం ఇష్టం లేక సిద్ధార్థ్ ఎట్టకేలకు క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్విట్టర్లో ఓ లేఖను విడుదల చేశాడు. అందులో సైనా నెహ్వాల్ను క్షమాపణలు కోరుతున్నానని అన్నాడు.
డియర్ సైనా.. నేను మీపై వేసిన అసభ్యకర జోక్కు మీకు నేను క్షమాపణలు చెబుతున్నా. మీరు చేసిన ట్వీట్ ను ఉద్దేశించి నేను నా అభిప్రాయాన్ని జోక్ రూపంలో చెప్పా. మీకు, నాకు అనేక విషయాల్లో భేదాభిప్రాయలు ఉండొచ్చు. కానీ మీ పట్ల నేను అలా ట్వీట్ చేసి ఉండకూడదు, అది సహేతుకం కాదని భావిస్తున్నా. అది జోక్.. చాలా మంచి జోక్. అంతకన్నా మించి నేనేమీ వివరణ ఇచ్చుకోలేను. కానీ ఆ జోక్ వేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరు ఎల్లప్పుడూ బ్యాడ్మింటన్లో నా చాంపియనే.. అని సిద్ధార్థ్ ముగించాడు.
కాగా సైనా నెహ్వాల్కు క్షమాపణలు చెప్పడంతో సిద్ధార్థ్ ఎట్టకేలకు ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…