Viral News : రహదారిపై వెళ్తున్నప్పుడు కొందరికి చిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వర్షం పడినప్పుడు రోడ్డు మీద లేదా పక్కన బురద గుంతలు ఉంటే.. వాటిల్లోంచి వాహనాలు వెళ్లినప్పుడు వాటి పక్కనే ఉండరాదు. ఉంటే మీద బురద పడుతుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందినే ఆ మహిళా పోలీసు ఎదుర్కొంది. కానీ ఆమె అందుకు ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రేవా అనే ప్రాంతంలో ఉన్న సిర్మౌర్ చౌక్లో ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ పక్కనే ఉన్న మహిళా పోలీసుపై బురద చిందించాడు. ఆమె పేరు శశికళ కాగా.. ఆమె స్థానిక కలెక్టర్ ఆఫీస్లో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తోంది.
అయితే బురద చిందించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వెంటనే అతన్ని ఆపి ముందుగా మీద పడిన బురదను శుభ్రం చేయించుకుంది. తరువాత అక్కడి నుంచి వెళ్తూ అతన్ని ఆమె చెంప దెబ్బ కొట్టింది. ఈ దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి షేర్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్గా మారింది.
సదరు మహిళా పోలీసు ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు. బురద పడితే క్లీన్ చేయించుకోవడం వరకు బాగానే ఉంది, కానీ అతన్ని చెంప దెబ్బ కొట్టడం ఎందుకని అంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…