Viral News : రహదారిపై వెళ్తున్నప్పుడు కొందరికి చిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వర్షం పడినప్పుడు రోడ్డు మీద లేదా పక్కన బురద గుంతలు ఉంటే.. వాటిల్లోంచి వాహనాలు వెళ్లినప్పుడు వాటి పక్కనే ఉండరాదు. ఉంటే మీద బురద పడుతుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందినే ఆ మహిళా పోలీసు ఎదుర్కొంది. కానీ ఆమె అందుకు ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రేవా అనే ప్రాంతంలో ఉన్న సిర్మౌర్ చౌక్లో ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ పక్కనే ఉన్న మహిళా పోలీసుపై బురద చిందించాడు. ఆమె పేరు శశికళ కాగా.. ఆమె స్థానిక కలెక్టర్ ఆఫీస్లో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తోంది.
అయితే బురద చిందించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వెంటనే అతన్ని ఆపి ముందుగా మీద పడిన బురదను శుభ్రం చేయించుకుంది. తరువాత అక్కడి నుంచి వెళ్తూ అతన్ని ఆమె చెంప దెబ్బ కొట్టింది. ఈ దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి షేర్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్గా మారింది.
సదరు మహిళా పోలీసు ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు. బురద పడితే క్లీన్ చేయించుకోవడం వరకు బాగానే ఉంది, కానీ అతన్ని చెంప దెబ్బ కొట్టడం ఎందుకని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…