ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి కొన్నాళ్లకే పెటాకులు అవుతుంది. ఏవో చిన్నా చితకా కారణాలకి కూడా వారు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ తన భర్త రోజూ స్నానం చేయడం లేదని డైవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పెళ్లైన 40 రోజులకే ఆమెకు విసుగొచ్చి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించింది. మహిళ చెప్పిన కారణం విని అక్కడి సిబ్బంది కూడా షాకైపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది . మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె భర్త నెలకు ఒకసారో రెండు సార్లో మాత్రమే స్నానం చేస్తాడట.
ఈ క్రమంలో అతడి శరీర దుర్గంధం భరించలేకపోతున్నానని ఆమె వాపోయింది. ఇంత అపరిశుభ్రంగా ఉండే వ్యక్తితో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది.ఈ విషయంలో యువతి భర్తను ప్రశ్నించగా అతడి సమాధానం అధికారులను ఆశ్చర్యపరిచింది. తాను నెలకు ఒకటో రెండో మార్లు మాత్రమే స్నానం చేస్తానని అతడు ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాడు. వారానికి ఒకసారి ఒంటిపై గంగాజలం జల్లుకుని అక్కడితో సరిపెడతానని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, తమకు పెళ్లైన తరువాత భార్య పోరు పడలేక 40 రోజుల్లో ఆరు సార్లు స్నానం చేశానంటూ అతను తెలియజేశాడు.
స్నానం విషయంలో నవ దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయని కౌన్సెలర్ మీడియాకు తెలిపారు. ఈ గొడవలు భరించలేక యువతి తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తరువాత భర్త కుటుంబంపై వారు కట్నం వేధింపుల కేసు కూడా పెట్టారని అన్నారు. డైవర్స్ కావాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఆ భర్త రోజూ స్నానం చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే, భార్య మాత్రం అతడితో కలిసుండేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మరోసారి కౌన్సెలింగ్కు రావాలని కౌన్సెలింగ్ సెంటర్ వారు ఆ దంపతులకు సూచించడంతో వారి దాంపత్య జీవితం ఎటు వైపు టర్నింగ్ తీసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…