తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నా పేరు, ఫొటోను చివరి నిమిషంలో ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు, అతని సహాయకుడి ద్వారా నిర్వాహకులు చేర్చినట్లు నాకు సమాచారం ఇచ్చారు. మైక్రోఫోన్ ఉండటం వల్ల ఒక వ్యాఖ్య తెలివైనదిగా లేదా హాస్యాస్పదంగా మారదు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత పెద్దగా వినిపించడమే. విషయంపై అవగాహన లేకుండా మాట్లాడే అసభ్య పదాలు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి గురించి కాకుండా మాట్లాడిన వ్యక్తి గురించి ఎక్కువగా చెబుతాయి.. అని త్రిష పోస్టులో పేర్కొంది. నటుడు విజయ్తో ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన అనంతరం పార్థిబన్ ఆమెపై వ్యాఖ్యలు చేయగా, అందుకు త్రిష కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
నటుడు విజయ్తో కలిసి త్రిష ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారి మధ్య రిలేషన్షిప్ నిజమే అని అందరికీ రూఢి అయింది. అయితే ఆ సంఘటన అనంతరం నటుడు పార్థిబన్ స్పందిస్తూ.. ఈ కుందవైను కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉంచాలి.. అన్నాడు. దీంతో త్రిష పై విధంగా ఘాటుగా స్పందించింది. అంతకు ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న పార్థిబన్ను తనతో కలసి పనిచేసిన నటీనటుల గురించి అభిప్రాయం చెప్పాలని శ్రోతలు కోరారు. దీంతో అతను తెరపై త్రిష కనిపించే సరికి ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ కుందవైను కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉంచాలి, అదే మంచిది, బయటకు రానివ్వకండి.. అన్నాడు. గతంలో త్రిష ఓ సినిమాలో నటించిన పాత్ర పేరు కుందవై కాగా పార్థిబన్ ఆమెను ఉద్దేశించే అన్నట్లు నిర్దారణ అయింది.
అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పార్థిబన్ తన ఎక్స్ ఖాతా ద్వారా క్షమాపణలు కోరాడు. కాగా త్రిష, విజయ్ కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మార్చి 5, 2026న నిర్మాత కల్పతి ఎస్. సురేష్, మీనాక్షి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు త్రిష, విజయ్ ఒకే కారులో వచ్చి కలిసి పాల్గొన్నారు. దీంతో వారి సంబంధం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో విజయ్ భార్య సంగీత డిసెంబర్ 2025లో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ ఫిబ్రవరి 27న బహిర్గతమైంది. త్రిషతో కలిసి విజయ్ పబ్లిక్గా కనిపించే కొన్ని గంటల ముందు అతని బాడీగార్డ్ చేసిన ఒక గూఢమైన సోషల్ మీడియా సందేశం కూడా ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది.
ఇక జరుగుతున్న విడాకుల వివాదంపై విజయ్ మొదటిసారిగా స్పందించాడు. మీరు అందరూ ఆ ఆరోపణలపై పోరాడుతూ బాధపడుతున్నారని నేను చూస్తున్నాను. మీరు బాధపడటం చూసి నాకూ బాధగా ఉంటుంది. వాటిని నేను చూసుకుంటాను. మనం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. ఆ విషయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ విషయం అంతగా పట్టించుకోవాల్సినది కాదు. ధైర్యంగా ఉండండి. మంచి విషయాలే జరుగుతాయి.. అని విజయ్ పేర్కొన్నాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి తన అభిమానులకు సందేశం ఇచ్చాడు.
విజయ్, త్రిష కొలీవుడ్లో విజయవంతమైన జంటగా గుర్తింపు పొందారు. ఘిల్లి చిత్రం ద్వారా ప్రారంభమైన వారి హిట్ జోడీ తర్వాత తిరుపాచి, ఆతి, కురువి వంటి చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత ఈ జంట దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాలో మళ్లీ కలిసి నటించింది. ఇటీవల నెలలుగా సోషల్ మీడియాలో విజయ్, త్రిష పేర్లు తరచూ కలిసి వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై విజయ్ లేదా త్రిష ఎవరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
జన నాయకన్ సినిమా సంబంధంగా సెన్సార్ బోర్డుతో జరిగిన వివాదం తర్వాత విజయ్ వ్యక్తిగత జీవితం కూడా రాజకీయ ప్రత్యర్థుల చర్చకు కేంద్రంగా మారింది. తమిళనాడులో జరిగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కళగం తరఫున రాజకీయంగా ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్చలు మరింత వేడెక్కాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…