ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి అదృష్టం కలిసోచ్చింది. ఒక్కసారిగా జాక్ పాట్ తగలడంతో ఆ గిరిజన బిడ్డ ఆనందానికి అవధులు లేవు. వివరాలలోకి వెళితే తుగ్గలి మండలం సూర్యతాండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీ పొలం పనులు చేస్తున్నాడు. ఇంతలో అతని కంటికి ఏదో కనిపించింది. ఏంటా అని పరీక్షపెట్టి చూడగా.. తెల్లగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని గమనించిన అతనికి వజ్రం అని అనుమానం కలిగింది. తోటి కూలీలు చూసి అది వజ్రమే అని చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.
రైతు కూలీకి వజ్రం దొరికిందన్న విషయం తెలియడంతో.. ఆ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూకట్టారు. కొంతమంది వ్యాపారులు ఆ వజ్రాన్ని పరిశీలించి.. అది 8 క్యారెట్లు ఉన్నట్లుగా తేల్చారు. కొంతమంది వ్యాపారులు ఈ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. ఆ రైతు కూలీ మాత్రం తనకు మంచి ధర చెల్లిస్తేనే ఇస్తానని చెప్పగా.. తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ప్రయత్నించారు. చివరికి పెరవలికి చెందిన వ్యాపారి రైతు కూలీకి రూ.5లక్షలు ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు. వజ్రం దొరకడంతో రైతుకూలీకి రూ.5లక్షల ఆదాయం వచ్చింది.. అయితే 8 క్యారెట్ల వజ్రాన్ని ఆ వ్యాపారి ఎక్కువ రేటుకే అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అలాగే గతవారం కూడా మరో రైతు కూలీకి వజ్రం దొరికింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తుగ్గలి రైతు పొలంలో ఈ వజ్రం బయటపడింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులకు ఇలాగే వజ్రాలు దొరికాయి. వర్షకాలం మొదలుకాగానే తొలకరి సమయంలో భారీ ఎత్తున జనాలు తుగ్గలిలో వజ్రాల వేటకు వస్తుంటారు.గతంలో విలువైన వజ్రాలు రూ.కోటి పిలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి, పగిడిరాయి, అగ్రహారం, హంప, యడవలి, కొత్తపల్లి, మద్దికెర ప్రాంతాల్లో వజ్రాల కోసం గాలిస్తుంటారు. అలాగే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు, పొట్టిపాడు, గంజికుంట, తట్రకల్లు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా ప్రాంతాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…