హారర్ సినిమా ప్రేమికుల్లో ‘డీమాంటీ కాలనీ’ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ… తెలుగులోనూ ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్ తీశారు. తొలుత వేరే దర్శకుడిని అనుకున్నా… చివరకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు ప్రాజెక్టులోకి వచ్చారు. అరుళ్ నిధి మరోసారి హీరోగా నటించారు. ఈసారి ఆయన డ్యూయల్ రోల్ చేయగా… ప్రధాన పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటించారు. తమిళంలో ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యింది. వారం ఆలస్యంగా ఆగస్టు 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన లభించింది.
దాదాపు కథలో మెయిన్ పాయింట్ ఒకేలా ఉన్నా.. వాటి చుట్టూ రాసుకొన్న పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ కథ, కుట్రలు, మోసాలు లాంటి అంశాలు చక్కగా తెర మీద చెప్పాలనే ప్రయత్నంలో మరోసారి సక్సెస్ అయ్యారు దర్శకుడు. తనకు అత్యంత బలంగా మారిన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడికి ఊపిరి సలపకుండా భావోద్వేగాలతో కట్టిపడేశాడు. అలాగే టెక్నికల్ అంశాలతో థియేటర్లలో ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేశాడని చెప్పవచ్చు. రకారకాల ట్విస్టులు, టర్న్లతో సినిమాను ఆద్యంతం పట్టుసడలకుండా కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకి అద్దం పట్టింది అని చెప్పాలి.
ఈ సినిమాని ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఎట్టకేలకి డేట్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27 నుండి తెలుగు, తమిళ భాషలలో జీ5లో డీమోంట్ కాలనీ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం థియేటర్స్లో మంచి రెస్పాన్స్ దక్కించుకొని రూ.50 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.’డీమాంటీ కాలనీ 2’లో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తు కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ సంస్థలు నిర్మించాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…