Garuda Puranam : గరుడ పురాణం గురించి అందరికీ తెలిసిందే. మనుషులు చేసే పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో అందులో స్పష్టంగా చెప్పబడింది. గరుడ పురాణాన్ని వేద వ్యాసుడు రచించగా అందులో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సమాజంలో మనుషులు తమ తోటి వారి పట్ల ఎలా మెలగాలి ? అనే అంశాలను ఈ పురాణంలో వివరించారు.
ఇక గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వారి ఇళ్లలో అన్నం తినకూడదో కూడా వివరించారు. ఒక నేరస్థుడు లేదా దొంగ ఇంట్లో అన్నం తినరాదు. ఎందుకంటే వారు ఎన్నో నేరాలు లేదా దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో అన్నం పెడతారు. అలాంటి అన్నాన్ని తింటే వారి పాపాలు మనకు చుట్టుకుంటాయి. కనుక అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.
మోసం చేసే గుణం ఉన్న స్త్రీ ఇంట్లో లేదా వ్యభిచారం చేసే స్త్రీ ఇంట్లో కూడా అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది.
వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల రక్త మాంసాలను వడ్డీలుగా వసూలు చేసే వ్యాపారస్తుల ఇంట్లోనూ అన్నం తినరాదు. విపరీతమైన కోపం ఉన్నవారు, నీచపు గుణాలు ఉండే వ్యక్తులు, ఒకరి మీద చాడీలు చెప్పే వారి ఇండ్లలోనూ అన్నం తినరాదు.
ఇక పేద వారి ఇంట్లోనూ అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే.. పేదలకు సహజంగానే ఆహారానికి కొరత ఉంటుంది. అలాంటి వారికి చేతనైతే ఆహారం పెట్టాలి. కానీ వారి దగ్గర ఉన్నది తినరాదు. తింటే పాపం తగులుతుంది. అదే వారికి ఆహారం పెడితే పుణ్యం లభిస్తుంది. కనుక గరుడ పురాణం ప్రకారం ఆ విధంగా చేయాల్సి ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…