Garuda Puranam : గరుడ పురాణం ప్రకారం.. అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.. ఎందుకో తెలుసా..?

January 17, 2022 9:39 PM

Garuda Puranam : గరుడ పురాణం గురించి అందరికీ తెలిసిందే. మనుషులు చేసే పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో అందులో స్పష్టంగా చెప్పబడింది. గరుడ పురాణాన్ని వేద వ్యాసుడు రచించగా అందులో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సమాజంలో మనుషులు తమ తోటి వారి పట్ల ఎలా మెలగాలి ? అనే అంశాలను ఈ పురాణంలో వివరించారు.

you should not eat in their houses according to Garuda Puranam

ఇక గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వారి ఇళ్లలో అన్నం తినకూడదో కూడా వివరించారు. ఒక నేరస్థుడు లేదా దొంగ ఇంట్లో అన్నం తినరాదు. ఎందుకంటే వారు ఎన్నో నేరాలు లేదా దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో అన్నం పెడతారు. అలాంటి అన్నాన్ని తింటే వారి పాపాలు మనకు చుట్టుకుంటాయి. కనుక అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.

మోసం చేసే గుణం ఉన్న స్త్రీ ఇంట్లో లేదా వ్యభిచారం చేసే స్త్రీ ఇంట్లో కూడా అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది.

వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల రక్త మాంసాలను వడ్డీలుగా వసూలు చేసే వ్యాపారస్తుల ఇంట్లోనూ అన్నం తినరాదు. విపరీతమైన కోపం ఉన్నవారు, నీచపు గుణాలు ఉండే వ్యక్తులు, ఒకరి మీద చాడీలు చెప్పే వారి ఇండ్లలోనూ అన్నం తినరాదు.

ఇక పేద వారి ఇంట్లోనూ అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే.. పేదలకు సహజంగానే ఆహారానికి కొరత ఉంటుంది. అలాంటి వారికి చేతనైతే ఆహారం పెట్టాలి. కానీ వారి దగ్గర ఉన్నది తినరాదు. తింటే పాపం తగులుతుంది. అదే వారికి ఆహారం పెడితే పుణ్యం లభిస్తుంది. కనుక గరుడ పురాణం ప్రకారం ఆ విధంగా చేయాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now