‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె తాను కారులో ప్ర‌యాణిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఉర్వశి రౌటేలా ఇటీవల కొన్ని రోజులుగా వృత్తిపరమైన కార్యక్రమాల కోసం కువైట్‌లో ఉంది.

March 10, 2026 9:24 PM
Urvashi Rautela safely reaches Mumbai from Kuwait during war tensions.
కువైట్ నుండి ముంబైకి చేరుకున్న తర్వాత భావోద్వేగానికి గురైన నటి ఊర్వశి రౌటేలా. Photo Credit: Urvashi Rautela/Instagram.

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె తాను కారులో ప్ర‌యాణిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఉర్వశి రౌటేలా ఇటీవల కొన్ని రోజులుగా వృత్తిపరమైన కార్యక్రమాల కోసం కువైట్‌లో ఉంది. అయితే అక్క‌డ యుద్ధం జ‌రుగుతుండ‌డంతో తాను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యానని అంత‌కు ముందు ఆమె సోష‌ల్ మీడియాలో తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఎట్ట‌కేల‌కు విమానంలో ఇండియాకు సేఫ్ గా చేరుకుంది. దీంతో ఆమె భావోద్వేగానికి గురైంది. త‌న ప్ర‌యాణంలో తాను ప‌డ్డ వేద‌న‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వివ‌రించింది.

అధికారుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఊర్వ‌శి రౌటేలా..

విమానంలో కూర్చున్న‌ప్పుడు తాను బాగానే ఉన్నాన‌ని ఊర్వ‌శి రౌటేలా తెలిపింది. అయితే సీట్‌లో కూర్చున్న వెంట‌నే ఒక్క‌సారిగా భ‌యం ఆవ‌రించింద‌ని, గుండె వేగంగా కొట్టుకుంద‌ని, త‌న‌కు ఆ స‌మ‌యంలో అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేద‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో తాను తీవ్రంగా భ‌య‌ప‌డ్డాన‌ని వెల్ల‌డించింది. తాను అప్పుడు బ‌ల‌హీన క్ష‌ణాల్లో ఉన్న‌ట్లు త‌న‌కు అనిపించింద‌ని, అందుక‌నే త‌న కోసం ప్రార్థించాల‌ని తాను ఆ స‌మ‌యంలో అభిమానుల‌ను వేడుకున్నాన‌ని తెలిపింది. అయితే తాను భావోద్వేగంతో మాట్లాడి ఉంటే అభిమానులు త‌న‌ను క్షమించాల‌ని కూడా ఆమె కోరింది. ఆ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న ప‌రిస్థితి నేప‌థ్యంలో అలా చేశాన‌ని చెప్పుకొచ్చింది. ఇక కువైట్‌లో విమానాశ్ర‌య సిబ్బంది, స్థానిక అధికారులు త‌న‌కు సుర‌క్షిత ప్ర‌యాణం క‌ల్పించినందుకు ఆమె వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

చిక్కుకుపోయిన న‌టులు..

కాగా ఇరాన్‌-అమెరికా మ‌ధ్య యుద్ధం తీవ్ర‌త‌రం కావ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి. దీంతో గ‌ల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న అనేక మంది భార‌తీయులు తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. సెల‌బ్రిటీలు కూడా కొంద‌రు అక్క‌డే చిక్కుకుపోయి విమాన స‌ర్వీసులు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడు ఇండియాకు వ‌స్తున్నారు. అందులో భాగంగానే ఊర్వ‌శి రౌటేలా కూడా విమాన స‌ర్వీసు ద్వారా భార‌త్‌కు చేరుకుంది. ఇక ఇప్ప‌టికే న‌టి సోనాల్ చౌహాన్ దుబాయ్ నుంచి సురక్షితంగా ఇంటికి చేరుకోగా న‌టులు ఈషా గుప్తా, ప్రీతి జింటా కూడా ఇండియాకు వ‌చ్చినట్లు తెలిపారు. కాగా న‌టి లారా ద‌త్తా ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉన్నాన‌ని, విమానాల కోసం చూస్తున్నాన‌ని వెల్ల‌డించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment