Sreeja : ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీల జంటలు విడాకులు తీసుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ తన భార్యకు విడాకులు ఇవ్వగా.. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరొందిన సమంత, నాగచైతన్యలు కూడా విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య, ఆమె భర్త ధనుష్లు విడిపోతున్నట్లు చెప్పారు. దీంతో సెలబ్రిటీ జంటల విడాకుల విషయం హాట్ టాపిక్గా మారింది.
ఇక చిరంజీవి కుమార్తె శ్రీజ కూడా తన భర్త కల్యాణ్ దేవ్ నుంచి విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. శ్రీజ నిన్న మొన్నటి వరకు తన భర్తను యాడ్ చేసి సోషల్ ఖాతాల్లో పేర్లు పెట్టుకుంది. శ్రీజ కల్యాణ్ అని ఇన్స్టాగ్రామ్తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు ఉండేది. అయితే ఆమె తాజాగా తన పేరును మార్చుకుంది. కల్యాణ్ తీసేసి ఆ స్థానంలో కొణిదెల అని పెట్టుకుంది. ప్రస్తుతం శ్రీజ కొణిదెల అనే పేరు కనిపిస్తోంది. దీంతో వారు విడిపోతున్నారని.. అందుకు సాక్ష్యం ఇదేనని అంటున్నారు.
గతంలో సమంత కూడా అక్కినేని అనే ఇంటి పేరును తన సోషల్ ఖాతాల నుంచి తీసేసి కేవలం ఎస్ అనే ఆంగ్ల అక్షరాన్ని మాత్రమే పెట్టుకుంది. దీంతో సమంత, నాగచైతన్య విడిపోతారని పుకార్లు షికార్లు చేశాయి. తరువాత అవే నిజమయ్యాయి. వారు విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇక ఇప్పుడు శ్రీజ కూడా అలాగే పేరును మార్చేయడంతో.. శ్రీజ, కల్యాణ్ దేవ్లు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఈ మధ్య కాలంలో కల్యాణ్ దేవ్ కూడా మెగా పార్టీల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే అతని తాజా మూవీ సూపర్ మచ్చిని మెగా ఫ్యామిలీ ఎవరూ ప్రమోట్ చేయడం లేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ ల విడాకులు నిజమే అని అనుమానాలు కలుగుతున్నాయి. వారిద్దరూ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారని.. అందుకనే శ్రీజ తన పేరు మార్చిందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ఫోర్మన్ (ట్రెయినీ) గ్రేడ్-C నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల…
జియో ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అండ్ సర్వీస్ లిమిటెడ్ ఫిబ్రవరి 11న తన జియోఫైనాన్స్ యాప్లో ఫిక్స్డ్ డిపాజిట్ల (FDs)…
దేశంలోని ప్రముఖ మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) 2026 సంవత్సరానికి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్…
చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…
భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా…
తమిళ నటుడు విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం థియేట్రికల్ రిలీజ్కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు…
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ,…
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్…