Chicken : సంక్రాంతి పండుగ సందర్బంగా చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంటుంది. అయితే ఈసారి కూడా అలాగే చాలా మంది ఊళ్లకు తరలివెళ్లారు. అయినప్పటికీ నగరంలో ఉన్నవారు మాత్రం భారీగా చికెన్ను లాగించేశారు.
గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల్లోనే హైదరాబాద్ వాసులు ఏకంగా 60 లక్షల కిలోల చికెన్ను తిన్నారు. సాధారణంగా మటన్ ధర ఎక్కువగా, చికెన్ ధర తక్కువగా ఉంటుంది. కనుక చికెన్ తినే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కిలో మటన్ ధర రూ.800 నుంచి కొన్ని చోట్ల రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ ధర మాత్రం కేజీకి రూ.240 వరకు పలికింది.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ వాసులు రోజుకు 10 లక్షల కిలోల చికెన్ తింటారు. కానీ సంక్రాంతి రోజుల్లో మాత్రం ఇంతకు రెట్టింపు స్థాయిలో చికెన్ను తినడం విశేషం. ఇక శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో 30 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగ్గా.. ఒక్క ఆదివారం రోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్ముడైంది.
ఇక సాధారణ రోజుల్లో హైదరాబాద్లో రోజుకు 2 లక్షల కిలోల మటన్ అమ్ముడవుతుంది. కానీ ఆదివారం రోజు ఏకంగా 5 లక్షల కిలోల మటన్ను కొనుగోలు చేశారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లోనూ 15 లక్షల కిలోల మేర మటన్ను విక్రయించారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…