Viral News : ఆ తండ్రి తన కుమార్తెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ ఆమె మాత్రం తండ్రిని ఎదిరించి, కుటుంబ సభ్యులను కాదని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె బతికుండగానే ఆ తండ్రి పిండం పెట్టాడు. తన కుమార్తు చనిపోయిందని కర్మ చేశాడు. ఈ షాకింగ్ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు స్నేహితులుగా ఉంటూనే ప్రేమలో పడ్డారు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అంగీకరించలేదు. దీంతో వారు తమ తల్లిదండ్రులను ఎదిరించి, వారిని కాదని చెప్పి ఈ నెల 13వ తేదీన ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే తమను కాదని చెప్పి తమ కుమార్తె అలా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఎంత మాత్రం భరించలేని ఆ తండ్రి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తమ కుమార్తె బతికి ఉండగానే చనిపోయిందని ప్రకటించాడు. అంతేకాదు ఆమెకు కర్మకాండలు చేశాడు.
అలా ఆ తండ్రి తన కుమార్తె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. అనంతరం గుండు గీయించుకున్నాడు. ఆమె బతికి ఉండగానే ఆమెకు పిండ ప్రదానం చేశాడు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. ఇక ఈ వార్తకు సంబంధించి ఇంకో విషయం కూడా ప్రచారం జరుగుతోంది.
తమ కుమార్తె ఇష్టం మేరకు వివాహం జరిపిస్తానని ఆమె తండ్రి చెప్పినా ఆ యువకుడు వినలేదని, దీంతో వారు వివాహం చేసుకున్నారని.. ఈ క్రమంలోనే తనను కాదని చెప్పి అలా పెళ్లి చేసుకుందనే కోపంతో ఆ తండ్రి ఈ విధంగా చేశాడని అంటున్నారు. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…