నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్ అన్నారు. తాను అస్సాం వాసినని, దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న కారణం వల్ల తెలుగు, తమిళం, మలయాళం భాషలను నేర్చుకుంటున్నానని తెలిపారు. భాషను నేర్చుకోవడం వల్ల సినిమాలో నటించడం తేలికవుతుందని తెలిపారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని ఆ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రేక్షకులు తనను తమిళంలో మాట్లాడడం లేదేంటి అని అడుగుతున్నారని, అయితే తాను దక్షిణాది అమ్మాయిని కానని తెలిపారు. ఇప్పుడే ఒక్కో భాషల్లో చిత్రాలు చేస్తున్నట్లు తెలిపిన ఆమె తన వల్ల అయినంత వరకు ఒక్కో భాషను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఏ భాషలో నటించినా ఆ భాషలో మాట్లాడడమే ముఖ్యమని, అందుకే ఇతర భాషలను నేర్చుకోవడానికి నూరు శాతం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు కాస్త సమయం ఇస్తే తెలుగు, తమిళం, మలయాళం భాషలను నేర్చుకుని సరళంగా మాట్లాడతానని అన్నారు. అలాగే తన రాబోయే చిత్రాల గురించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
డ్రాగన్ చిత్రం తరువాత కోలీవుడ్లో వరుసగా నటించకపోవడానికి కారణం ఏమిటిని ప్రశ్నించగా ఆమె బదులిస్తూ.. తాను మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, మంచి సక్సెస్ ఫుల్ చిత్రంతో మళ్లీ వస్తానని తెలిపారు. డ్రాగన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులు తనపై చూపిన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువన్నారు. కాబట్టి వైవిధ్య భరిత కథా చిత్రాల్లో నటించి వారిని మెప్పించాలని చూస్తున్నట్లు తెలిపారు. కాగా కయాదు లోహర్ కోలీవుడ్కు డ్రాగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. తరువాత ఇతర భాషల్లోనూ వరుసగా అవకాశాలు వచ్చాయి. మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల చిత్రాల్లో ఆమె ప్రస్తుతం నటిస్తున్నారు. కయాదు లోహర్ ఇటీవల తెలుగులో నటించిన ఫంకీ అనే చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఈమె మలయాళంలో నటిస్తున్న పళ్లిచటంబి అనే మూవీ త్వరలో విడుదల కానుంది.
కయదు లోహర్ తెలుగులో నానికి జోడీగా ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అంతకు ముందు తమిళంలో నటించిన ఇమ్మోర్టల్, ఇదయం మురళి అనే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ నటుడు శింబుకు జోడీగా ఆయన 49వ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. అలాగే మరో మలయాళ చిత్రంలోనూ ఈమె నటిస్తున్నారు.
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…