Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈయన పలువురి జాతకాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అప్పట్లో ఈయన జగన్ సీఎం అవుతారని చెప్పారు. అది జరిగింది. అలాగే సమంత, నాగచైతన్య విడిపోతారని కూడా చెప్పారు. అది కూడా నిజమైంది. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలకు బలం చేకూరినట్లు అయింది. ఈ క్రమంలోనే ఆయన జాతకాన్ని కూడా చాలా మంది బలంగా నమ్మడం మొదలు పెట్టారు. ఇక ఈమధ్య కూడా ఆయన నరేష్ వైవాహిక జీవితంపై వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో తాను సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో తరచూ పూజలు చేసేవాడినని తెలిపారు. అయితే నరేష్, రమ్య రఘుపతిల జాతకాలను చూసి వారికి పెళ్లి చేయవద్దని కోరానని.. చేసినా కూడా వారు విడిపోతారని చెప్పానని.. అన్నారు. తాను అన్నట్లుగానే వారు విడిపోయారని.. అయితే అప్పట్లో వారి మేలు కాంక్షించే ఆ విషయం చెప్పానని.. కానీ వారు తప్పుగా అర్థం చేసుకున్నారని.. అప్పటి నుంచి వారి ఇంటికి వెళ్లడం లేదని.. వేణు స్వామి తెలియజేశారు. అయితే ఆయన చెప్పినట్లుగానే నరేష్ తన భార్య రమ్య రఘుపతితోనూ విడిపోయారు. ఈ క్రమంలోనే వేణు స్వామి జాతకంపై అందరికీ గురి కుదురుతోంది.
ఇక వేణు స్వామి తాజాగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు నార్త్, ఇటు సౌత్లో దూసుకుపోతున్న నయనతార, రష్మిక మందన్న, పూజా హెగ్డెలు పెళ్లి చేసుకున్నా వారు విడాకులు తీసుకుంటారని అన్నారు. ఈ ముగ్గురికీ 2024 బాగుందని.. ఆ తరువాత సమస్యలు వస్తాయని తెలిపారు. కాగా నయనతారకు ఇప్పటికే పెళ్లి అయింది. ఇటీవలే ఆమె దర్శకుడు విగ్నేష్ శివన్ను వివాహం చేసుకుంది. ఇక రష్మిక మందన్న గతంలో పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో ఆమెకు, పూజా హెగ్డెకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే వీరు పెళ్లి చేసుకున్నా విడిపోతారని, విడాకులు తీసుకుంటారని.. వేణు స్వామి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మరి ఆయన చెప్పినట్లు వారి జాతకాల్లో జరుగుతుందో.. లేదో.. చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…