Nagarjuna : టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరుగాంచిన నాగచైతన్య, సమంత విడిపోవడం ఎంతో మందిని షాక్కు గురి చేసింది. వారు అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. అయితే మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు సమంత తమ జీవితాలపై ఎన్నో కామెంట్స్ చేస్తూ సందేశాలు పెట్టింది. అలాగే ఈమధ్యే కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరణ్ జోహార్ సమంత భర్త అని సంబోధిస్తే.. కాదు.. మాజీ భర్త అనాలని సూచించింది. అలాగే తమ ఇద్దరినీ ఒకే గదిలో పెడితే పదునైన వస్తువులను ఉంచకూడదని కామెంట్స్ చేసింది. అంటే సమంత, నాగచైతన్యలు ప్రేమికుల్లా ఉండి ఎంత బద్ద శత్రువులుగా మారారో.. ఆమె వ్యాఖ్యలను బట్టి ఇట్టే అర్థమవుతుంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య మొదటి నుంచి సైలెంట్గానే ఉన్నాడు. అలాగే థాంక్ యూ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సమంత గురించి ప్రశ్నలు వచ్చినా ఆమె మంచిదని చాలా కూల్గానే సమాధానాలు చెప్పాడు. కానీ సమంత మాత్రం అతన్ని శత్రువుగానే చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో నీకు, మా హీరో చైతూకు ఎంతో తేడా ఉందని.. అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. అయితే నెటిజన్లు మాత్రం నాగచైతన్య జీవితం ఇలా అవడానికి కారణం నాగార్జుననే అని అంటున్నారు. ఆయన వల్లే చైతూ సమంతను కోల్పోయాడని అంటున్నారు. ఇక దీనికి కారణాలను కూడా చెబుతున్నారు.
నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లక్ష్మితో విడాకుల అనంతరం హీరోయిన్గా ఉన్న అమలను ఆయన వివాహం చేసుకున్నారు. తరువాత అఖిల్ జన్మించాడు. లక్ష్మికి అంతకు ముందే నాగచైతన్య పుట్టాడు. అయితే విడాకుల వల్ల చైతూ తల్లిదండ్రుల వద్ద కలసి పెరిగే అవకాశం లేకుండా పోయిందని.. దీంతో ఇద్దరితోనూ అటాచ్మెంట్ తక్కువేనని అంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలో ఎలా ఉండాలో చైతూకు తెలియదని.. అందువల్లే సమంతకు దూరమయ్యాడని అంటున్నారు. అదే ఇద్దరు తల్లిదండ్రుల వద్ద పెరిగి ఉంటే చైతన్య కథ మరోలా ఉండేదని.. సమంతకు సర్ది చెప్పో.. మరో రకంగానో ఇద్దరూ కలసి ఉండేవారని అంటున్నారు. ఈ క్రమంలోనే చైతన్య జీవితం ప్రస్తుతం ఇలా అయ్యేందుకు పరోక్షంగా నాగార్జున కూడా కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. అయితే చైతూ, సమంతల భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…