Venkatesh : కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే చాలా రోజుల పాటు థియేటర్స్ మూతపడడంతో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. మోహన్ లాల్, సూర్య, నాని, వెంకటేష్ వంటి వారు చేసేదేం లేక తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేశారు. అయితే నాని నటించిన టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రకటన వచ్చినప్పుడు పెద్ద వివాదాలే నడిచాయి.
నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని… నిజ జీవితంలో పిరికివాడు అంటూ నానిపై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది. ఇంత జరిగిన కొన్ని రోజులకు వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మించిన నారప్ప ఓటీటీలో విడుదలైంది. ఆ సమయంలో మాట్లాడేవారే కరువయ్యారు.
ఇక ఇప్పుడు వెంకటేష్ మరో చిత్రం దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్లో విడుదల అవుతుందని రీసెంట్గా ప్రకటించారు. దాంతో సోషల్ మీడియాలో ,మీడియాలో ఓ ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. నానిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు దృశ్యం 2 ని థియేటర్ లలో రిలీజ్ చేయండని అడగడం లేదేంటి, సురేష్ బాబుకు భయపడి ఇలా సైలెంట్ అయ్యారా.. అని మరికొందరు క్వశ్చన్ చేస్తున్నారు. థియటర్స్ సజావుగా నడుస్తున్న సమయంలోనూ దృశ్యం 2ని ఓటీటీలో విడుదల చేస్తున్నా, ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…