T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 48 బంతులు ఆడిన విలియమ్సన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజల్వుడ్ 3 వికెట్లు తీయగా, ఆడమ్ జంపా 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్తోపాటు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ లు చెలరేగిపోయారు. 38 బంతులు ఆడిన వార్నర్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మాక్స్వెల్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…