Upasana Konidela : కొణిదెల వారి ఇంటి కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉపాసన అనగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సినిమా రంగంతో ఎక్కువ టచ్ లేకపోయినా సినీ అభిమానులకు, భర్తకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ మెగా ఫాన్స్ తో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన వీలు తోచినప్పుడల్లా సామజిక కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఉపాసన చేసే మంచి పనులతో ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటి వారికి కూడా మంచి పేరు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ఉపాసన తాజాగా మరోసారి ఇంకో పనికి శ్రీకారం చుట్టి తన మంచి మనసు చాటుకున్నారు. మెట్టినింటిలోనే కాకుండా సమాజంలో కూడా ఉపాసనకు ఎంతో మంచి పేరు ఉంది.
లక్ష్మణ్ అనే వ్యక్తి ఉపాసన ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఓసారి మాటల సందర్భంలో బస్తీ పిల్లల కోసం స్కూల్ కట్టించడానికి రెడీగా ఉన్నానని ఉపాసన అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే మాట మీద నిలబడ్డారని, అపోలో ఫౌండేషన్ ద్వారా త్వరలో స్కూల్ కట్టించబోతున్నారు అమ్మ గారు అని లక్ష్మణ్ చెబుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.
తాజాగా ఆ బస్తీలో జరిగిన వినాయక చవితి వేడుకకు అతిథిగా వచ్చారు ఉపాసన. లక్ష్మణ్ మా ఇంటిలో ముఖ్యమైన వ్యక్తి. అతనికి కావలసిన సహాయం అందించడంలో నేను ఎప్పుడూ ముందే ఉంటాను అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బస్తీలో కట్టబోయే స్కూల్ గురించి కూడా ఉపాసన మీడియాతో సంభాషించారు. ఉపాసన ఎంత అందంగా ఉంటారో ఆమె మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరోసారి చాటి చెప్పారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…