Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ ను నవంబర్ 4న స్ట్రీమింగ్ చేయనున్నారు. మొన్నటి వరకు తొలి ఎపిసోడ్ గెస్ట్ ఎవరా అని అందరిలోనూ అనుమానాలు ఉండేవి. తాజాగా ప్రోమోతో పూర్తి క్లారిటీ ఇచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, ఇద్దరి మధ్యా ఆసక్తికర చర్చ నడిచింది.
తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు అప్పగించారు ? అని మోహన్ బాబు అడగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎవరో ఫిటింగులు పెడుతుంటారు అంటూ చెప్పడం, అరవిందే.. నన్ను ఈ ప్రశ్న అడగమని చెప్పి ఉంటారు ? అని మోహన్ బాబు అనడం చూస్తుంటే షో రసవత్తరంగా ఉంటుందని అర్ధమవుతోంది.
షో ఆరంభంలో మోహన్ బాబు రాగా, ఆ తర్వాత మంచు లక్ష్మీ, మంచు విష్ణు అడుగుపెట్టారు. మంచు లక్ష్మీ.. బాలయ్యతో డ్యాన్స్ చేయడం స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. సాధారణంగా మోహన్ బాబు టాక్ షో ల్లో ఎక్కువగా కనిపించరు. ఆ మధ్య అలీ టాక్ షో లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షో లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ షో ఉంటుందనే నమ్మకాన్ని ఆహా వారు వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…