Bigg Boss 5 : బిగ్ బాస్ 8వ వారంలో భాగంగా శనివారం నాగార్జున హౌస్ సభ్యులతో ముచ్చటిస్తూ వారంలో వారు చేసిన తప్పు ఒప్పుల గురించి మాట్లాడుతూ హౌస్ సభ్యులకు క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ ను సేవ్ చేయడం కోసం పలు టాస్క్ లను నిర్వహించారు. ఈ క్రమంలోనే పూరీలు చేసే టాస్క్, అలాగే వైకుంఠపాలి ఆటను కూడా కంటెస్టెంట్ లతో ఆడించారు. ఈ ఆట తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెడలో మోత – సరిపోయే సామెత అని గేమ్ ఆడించారు.
ఈ ఆటలో భాగంగా నాగార్జున సామెతలు చదివితే కంటెస్టెంట్ లు ఆ సామెత ఎవరికీ సరిగ్గా సరిపోతుందో ఆ సామెత తీసుకెళ్ళి ఆ కంటెస్టెంట్ మెడలో వేయాలి. ఈ క్రమంలోనే కుక్క తోక వంకర అనే సామెతను సన్ని తీసుకెళ్లి జేసీ మెడలో వేశాడు. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అనే సామెతను మానస్ తీసుకెళ్లి రవి మెడలో వేశాడు. అలాగే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెతను కాజల్ శ్రీరామ్ కి అంకితం ఇచ్చింది. అనీమాస్టర్ రాను రాను రాజు గుర్రం గాడిద అయింది అనే సామెతను తీసుకెళ్లి కాజల్ కి అంకితం చేసింది.
కందకు లేని దురద కత్తిపీటకెందుకు అనే సామెతను ప్రియాంక సిరి మెడలో వేసింది. అంతంత కోడికి అర్థ సేరు మసాలా ఎందుకు అనే సామెతను శ్రీరామ్ కాజల్ కు సూట్ అవుతుందని చెప్పాడు. ఇక విశ్వా దున్నపోతు మీద వర్షం పడినట్టు అనే సామెతను లోబోకి అంకితం చేశాడు. పైన పటారం లోన లొటారం అని సామెతను సన్నీకి జెస్సీ అంకితం చేశాడు. అందని ద్రాక్ష పుల్లన అనే సామెతను సిరి షన్నుకు ఇచ్చింది.
ఏకులా వచ్చి మేకులా దిగాడు అనే సామెత షన్ను రవికి ఇచ్చాడు. రవి ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న దిగిన తర్వాత బోడి మల్లన్న అనే సామెతను మానస్ కి ఇవ్వగా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే సామెతను లోబో అనీ మాస్టర్ కి అంకితం చేశాడు. ఇలా ఈ గేమ్ అయిన తర్వాత నాగార్జున ఎవరు సేవ్ అయ్యారు అనే విషయాన్ని చెప్పకుండా సస్పెన్స్ పెడుతూ నేటి ఎపిసోడ్ గురించి మాట్లాడారు. ఇక నేడు దీపావళి సందర్భంగా యాంకర్ సుమ, శ్రీయ స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…