Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన కామెడీ ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బ్రహ్మానందం.. నటుడు కృష్ణంరాజు దంపతులను కలిశారు. గత కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్య కారణంగా శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బ్రహ్మానందం తను స్వయంగా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని కృష్ణంరాజు దంపతులకు బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాకుండా.. మంచి కళాకారుడు కూడా అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
అదేవిధంగా బ్రహ్మానందం కృష్ణంరాజు దంపతులకు మంచి బహుమతిని అందించినందుకు బ్రహ్మానందంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో బ్రహ్మానందం స్వయంగా తాను గీసిన చిత్రాలను అల్లు అర్జున్, రానాకి కూడా ప్రత్యేకంగా పంపించారు. ఇక బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితుల కారణంగా కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రంగమార్తాండ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…