Telugu States : భ‌ర్త‌లు కొట్టినా ఫ‌ర్వాలేద‌ని చెబుతున్న 84 శాతం మంది తెలుగు మ‌హిళ‌లు.. షాకింగ్ స‌ర్వే..

November 29, 2021 4:44 PM

Telugu States : పూర్వ‌కాలం నుంచి స‌మాజంలో స్త్రీల ప‌ట్ల వివ‌క్ష నెల‌కొని ఉంది. వారికేమీ చేత‌కాదు, వారు కేవ‌లం వంట ఇంటికే ప‌రిమితం కావాల‌నే భావం అప్ప‌టి నుంచి ఉంది. దాన్ని ఇప్పటికీ కొన‌సాగిస్తున్నారు. స్త్రీలు పురుషుల క‌న్నా దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న‌ప్ప‌టికీ వారిపై వివ‌క్ష మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే ఈ నేప‌థ్యంలోనే ఓ షాకింగ్ స‌ర్వే బయ‌ట‌కు వ‌చ్చింది. అందులో తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Telugu States : భ‌ర్త‌లు కొట్టినా ఫ‌ర్వాలేద‌ని చెబుతున్న 84 శాతం మంది తెలుగు మ‌హిళ‌లు.. షాకింగ్ స‌ర్వే..

నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే (NFHS) ప్ర‌కారం మ‌న దేశంలో చాలా రాష్ట్రాల్లో మ‌హిళ‌లు త‌మ‌ను త‌మ భ‌ర్త‌లు కొట్టినా ఫ‌ర్వాలేద‌ని అనుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో 30 శాతం మంది మ‌హిళ‌లు ఇందుకు అనుకూలంగా ఉన్నారు. అంటే.. వీరంద‌రూ త‌మను త‌మ భ‌ర్త‌లు కొట్టినా ఫర్వాలేద‌ని భావిస్తున్నార‌న్న‌మాట‌.

అయితే ఈ ప‌రిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మ‌రీ అధ్వాన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 84 శాతం మంది మ‌హిళ‌లు త‌మ‌ను త‌మ భ‌ర్త‌లు కొట్టినా ఫ‌ర్వాలేదులే అన్న ధోర‌ణిలో ఉన్నట్లు వెల్ల‌డైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల త‌రువాత స్థానంలో క‌ర్ణాట‌క ఉంది. అక్క‌డ 77 శాతం మంది మ‌హిళ‌లు ఆ విధంగా ఫీల‌వుతున్నార‌ట‌.

సాధార‌ణంగా ఇంట్లో పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, భ‌ర్త త‌ర‌ఫు కుటుంబ స‌భ్యుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, అనుమానాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదా వివాహేత‌ర సంబంధాలు పెట్టుకోవ‌డం, భ‌ర్త లేదా కుటుంబ స‌భ్యుల‌తో త‌ర‌చూ వాదించ‌డం, శృంగారం చేసేందుకు విముఖ‌త‌ను చూపించ‌డం, న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, భ‌ర్త‌కు చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్ల‌డం, ఇంటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం, వంట చేయ‌క‌పోవ‌డం.. వంటి అంశాల్లో భ‌ర్త‌లు త‌మ‌ను కొట్టినా ఫ‌ర్వాలేదులే.. అని ఆ శాతం మంది మహిళ‌లు అనుకుంటున్నారు. ఈ మేర‌కు స‌ర్వేలో వెల్ల‌డి కావ‌డం షాక్‌ను క‌లిగిస్తోంది.

అయితే ఈ విధంగా మ‌హిళ‌ల ధోర‌ణి ఉందంటే గృహ హింస కూడా ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు భావించాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు. పూర్వ కాలం నుంచి స్త్రీల ప‌ట్ల ఉన్న ధోరణి ఇంకా అలాగే ఉంద‌ని చెప్ప‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని నిపుణులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment