దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కరోనా రక్కసి ఏకంగా కుటుంబాలపై పంజా విసిరి కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంటుంది. ఈ మహమ్మారి బారిన పడి ఓ వ్యక్తి ఏకంగా నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రాణాలు దక్కించుకో లేకపోయాడు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకొని అక్కడ సిమెంట్, ఐరన్ వ్యాపారంతో పాటు జిమ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా రాజన్ బాబు తన భార్య ,ఇద్దరు పిల్లలు కరోనా భారినపడగా అందరూ
క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో అతనికి చికిత్స నిమిత్తం నగరంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.అన్ని ఆస్పత్రులలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేశారు. రాజన్ బాబు చికిత్స కోసం ఫ్లాట్ ను కూడా అమ్మేసి చికిత్స అందించారు. సుమారు నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ అతని ప్రాణాలు కోల్పోయాడు. రాజన్ బాబు మాత్రమే కాకుండా తన తల్లి, సోదరి సైతం ప్రాణాలు కోల్పోగా భార్య పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విధంగా కరోనా మహమ్మారికి కుటుంబం మొత్తం బలి కావడంతో రాజన్ భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…