సాధారణంగా హిందువులు శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే శంఖాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే కొందరు శంఖాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజలు చేస్తారు. అయితే శంఖాన్ని కొనుగోలు చేసేవారు ఒక శంఖాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ శంఖం కొనేటప్పుడు తప్పకుండా రెండు శంఖాలు కొనాలని పండితులు చెబుతున్నారు.
ఒక శంఖాన్ని నీటి శంఖం అని పిలుస్తారు. ఈ శంఖం పూజకు ఎంతో పవిత్రమైనది. ఈ శంఖాన్ని దేవుడి గదిలో ఎర్రని వస్త్రంపై ఉంచి విష్ణుమూర్తి పాదాల చెంత పెట్టి పూజించాలి. ఈ నీటి శంఖంలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా నీటి శంఖాన్ని విష్ణువు పాదాలచెంత పెట్టి పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మరొక శంఖాన్ని పూజ తరువాత శంఖారావం చేయడం కోసం వినియోగించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా రెండు శంఖాలను పూజ గదిలో వేర్వేరు స్థానాలలో ఉంచి పూజలు చేయాలి. అంతేకానీ శంఖాన్ని మన ఇంట్లో ఒక అలంకరణ వస్తువుగా ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…