సాధారణంగా హిందువులు శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే శంఖాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే కొందరు శంఖాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజలు చేస్తారు. అయితే శంఖాన్ని కొనుగోలు చేసేవారు ఒక శంఖాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ శంఖం కొనేటప్పుడు తప్పకుండా రెండు శంఖాలు కొనాలని పండితులు చెబుతున్నారు.
ఒక శంఖాన్ని నీటి శంఖం అని పిలుస్తారు. ఈ శంఖం పూజకు ఎంతో పవిత్రమైనది. ఈ శంఖాన్ని దేవుడి గదిలో ఎర్రని వస్త్రంపై ఉంచి విష్ణుమూర్తి పాదాల చెంత పెట్టి పూజించాలి. ఈ నీటి శంఖంలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా నీటి శంఖాన్ని విష్ణువు పాదాలచెంత పెట్టి పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మరొక శంఖాన్ని పూజ తరువాత శంఖారావం చేయడం కోసం వినియోగించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా రెండు శంఖాలను పూజ గదిలో వేర్వేరు స్థానాలలో ఉంచి పూజలు చేయాలి. అంతేకానీ శంఖాన్ని మన ఇంట్లో ఒక అలంకరణ వస్తువుగా ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…