ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం జాగ్రత్తలు పాటించడం, వాక్సిన్ తీసుకోవడమే మన ముందున్న అస్త్రాలు.ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.తాజాగా భారతదేశంలో రెండవ దశ తీవ్రత అధికంగా ఉండడంతో రోజురోజుకు కేసులు అధికం అవుతూ ఎంతోమంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆక్సిజన్ లభించగా ప్రాణాలు వదులుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుల ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడుకోగలమని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి వారి వారి వాదనలను వినిపించారు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య తయారు చేస్తున్న మందు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని ఆనందయ్య ఆయుర్వేద మందు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మందు కాదని, అది అతను తయారు చేసే చట్నీ అని ఇది తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయట పడకుండా చస్తారంటూ బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కరోనా 14 రోజులలో తగ్గిపోతుంది. అలాంటిది పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కృష్ణ పట్నం వెళ్లి మందు తీసుకుంటేనే నయమవుతుందనడం సమంజసం కాదు.ఇప్పటికైనా కృష్ణ పట్నం వెళ్లి మందులు తీసుకున్న వారు అందరూ కూడా మరోసారి పరీక్షలు చేయించుకోవాలని, ఇప్పటికే మనం ఎంతో ప్రమాదపు అంచుల్లో ఉన్నాము, ఇలాంటి సమయంలో ఈ మందులు వాడితే మన ప్రాణానికి కాకుండా ఇతరులకు కూడా ఎత్తు ప్రమాదం కల్పించిన వారవుతారని బాబు గోగినేని తెలిపారు.ఈ విధంగా కృష్ణపట్నం ఆనందయ్య నందు పై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…