ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం జాగ్రత్తలు పాటించడం, వాక్సిన్ తీసుకోవడమే మన ముందున్న అస్త్రాలు.ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.తాజాగా భారతదేశంలో రెండవ దశ తీవ్రత అధికంగా ఉండడంతో రోజురోజుకు కేసులు అధికం అవుతూ ఎంతోమంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆక్సిజన్ లభించగా ప్రాణాలు వదులుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుల ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడుకోగలమని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి వారి వారి వాదనలను వినిపించారు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య తయారు చేస్తున్న మందు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని ఆనందయ్య ఆయుర్వేద మందు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మందు కాదని, అది అతను తయారు చేసే చట్నీ అని ఇది తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయట పడకుండా చస్తారంటూ బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కరోనా 14 రోజులలో తగ్గిపోతుంది. అలాంటిది పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కృష్ణ పట్నం వెళ్లి మందు తీసుకుంటేనే నయమవుతుందనడం సమంజసం కాదు.ఇప్పటికైనా కృష్ణ పట్నం వెళ్లి మందులు తీసుకున్న వారు అందరూ కూడా మరోసారి పరీక్షలు చేయించుకోవాలని, ఇప్పటికే మనం ఎంతో ప్రమాదపు అంచుల్లో ఉన్నాము, ఇలాంటి సమయంలో ఈ మందులు వాడితే మన ప్రాణానికి కాకుండా ఇతరులకు కూడా ఎత్తు ప్రమాదం కల్పించిన వారవుతారని బాబు గోగినేని తెలిపారు.ఈ విధంగా కృష్ణపట్నం ఆనందయ్య నందు పై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…