ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం జాగ్రత్తలు పాటించడం, వాక్సిన్ తీసుకోవడమే మన ముందున్న అస్త్రాలు.ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.తాజాగా భారతదేశంలో రెండవ దశ తీవ్రత అధికంగా ఉండడంతో రోజురోజుకు కేసులు అధికం అవుతూ ఎంతోమంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆక్సిజన్ లభించగా ప్రాణాలు వదులుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుల ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడుకోగలమని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి వారి వారి వాదనలను వినిపించారు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య తయారు చేస్తున్న మందు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని ఆనందయ్య ఆయుర్వేద మందు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మందు కాదని, అది అతను తయారు చేసే చట్నీ అని ఇది తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయట పడకుండా చస్తారంటూ బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కరోనా 14 రోజులలో తగ్గిపోతుంది. అలాంటిది పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కృష్ణ పట్నం వెళ్లి మందు తీసుకుంటేనే నయమవుతుందనడం సమంజసం కాదు.ఇప్పటికైనా కృష్ణ పట్నం వెళ్లి మందులు తీసుకున్న వారు అందరూ కూడా మరోసారి పరీక్షలు చేయించుకోవాలని, ఇప్పటికే మనం ఎంతో ప్రమాదపు అంచుల్లో ఉన్నాము, ఇలాంటి సమయంలో ఈ మందులు వాడితే మన ప్రాణానికి కాకుండా ఇతరులకు కూడా ఎత్తు ప్రమాదం కల్పించిన వారవుతారని బాబు గోగినేని తెలిపారు.ఈ విధంగా కృష్ణపట్నం ఆనందయ్య నందు పై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…