Gadwal : సాధారణంగా ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే ఎంతో మంది ఆడ పిల్లల పట్ల వివక్షత చూపిస్తూ వారిని కడుపులోనే కడ తేర్చడం లేదా పుట్టిన తర్వాత చెత్త కుప్పలు, మురికి కాలువల పాలు చేయడం మనం చూస్తుంటాము. అయితే గద్వాల్ జిల్లాలో వింత ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు వరుసగా కూతుర్లు పుడుతున్నారన్న నెపంతో ఆ భర్త ఏకంగా భార్యను కడతేర్చిన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన పల్లవి అనే యువతికి, గద్వాలకు చెందిన వెంకటేశ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గత ఏడాది ఒక పాప జన్మించింది. ఈ క్రమంలోనే పల్లవి మరోసారి గర్భం దాల్చడంతో ఈసారి ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విధంగా వరుసగా ముగ్గురు కూతుర్లు పుట్టినప్పటికీ జీర్ణించుకోలేని వెంకటేష్ పల్లవి నిద్రిస్తుండగా ఆమెపై కోపంతో గొంతు నులిమి చంపాలని ప్రయత్నించాడు.
అయితే పల్లవి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఏమైందని ప్రశ్నించగా ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే పల్లవి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో బంధువులకు అతని మాటలపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నిర్వహించడంతో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారమే పల్లవిని హత్య చేశాడని తెలియడంతో వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం కూతుళ్లకు జన్మనిచ్చిందన్న కారణంగా భార్యను కడతేర్చాడని తెలియడంతో స్థానికులు వెంకటేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…