Gadwal : సాధారణంగా ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే ఎంతో మంది ఆడ పిల్లల పట్ల వివక్షత చూపిస్తూ వారిని కడుపులోనే కడ తేర్చడం లేదా పుట్టిన తర్వాత చెత్త కుప్పలు, మురికి కాలువల పాలు చేయడం మనం చూస్తుంటాము. అయితే గద్వాల్ జిల్లాలో వింత ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు వరుసగా కూతుర్లు పుడుతున్నారన్న నెపంతో ఆ భర్త ఏకంగా భార్యను కడతేర్చిన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన పల్లవి అనే యువతికి, గద్వాలకు చెందిన వెంకటేశ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గత ఏడాది ఒక పాప జన్మించింది. ఈ క్రమంలోనే పల్లవి మరోసారి గర్భం దాల్చడంతో ఈసారి ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విధంగా వరుసగా ముగ్గురు కూతుర్లు పుట్టినప్పటికీ జీర్ణించుకోలేని వెంకటేష్ పల్లవి నిద్రిస్తుండగా ఆమెపై కోపంతో గొంతు నులిమి చంపాలని ప్రయత్నించాడు.
అయితే పల్లవి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఏమైందని ప్రశ్నించగా ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే పల్లవి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో బంధువులకు అతని మాటలపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నిర్వహించడంతో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారమే పల్లవిని హత్య చేశాడని తెలియడంతో వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం కూతుళ్లకు జన్మనిచ్చిందన్న కారణంగా భార్యను కడతేర్చాడని తెలియడంతో స్థానికులు వెంకటేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…