Shani Dosham : సాధారణంగా చాలా మంది జాతక దోషంలో శని గ్రహ ప్రభావం దోషం ఉండటం వల్ల వారు ఏ పనులు చేపట్టినా ముందుకు సాగవు. అదేవిధంగా ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇలా శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఆలయంలో నవగ్రహాల పూజ చేయించడం, శని గ్రహదోష పరిహారం చేయించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే మన దేశంలో పలు చోట్ల శనీశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది.. పావగడ శనీశ్వరాలయం.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి పావగడలో వెలసిన శనీశ్వరాలయం ఎంతో మహిమ గల ఆలయం అని చెప్పవచ్చు. శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్లి స్వామి వారిని పూజించడం వల్ల వారిపై శని ప్రభావ దోషం తొలగిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి మొక్కులు చెల్లించి, తమపై శని ప్రభావం దోషం ఉండకుండా పరిహారాలు చేయించడంతో శని ప్రభావం తొలగిపోతుందని చెబుతారు.
ఈ శనీశ్వరాలయంలో ప్రజలు ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అమ్మవారికి పూజలు చేసేవారు. ఇలా అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఆ ప్రాంతమంతా ఏ విధమైనటువంటి కరువుకాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉందని, అమ్మవారి విగ్రహానికి ఆలయం నిర్మించి పూజలు చేసేవారు. ఈ క్రమంలోనే ఆలయంలో శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించి శనీశ్వరుడి విగ్రహం ప్రతిష్టించారు. అప్పటి నుంచీ ఈ ఆలయం శనీశ్వరాలయంగా పేరుగాంచింది. ఈ ఆలయానికి కర్ణాటక వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామివారికి తలనీలాలు, నిలువు దోపిడీ చెల్లించడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల తమపై ఉన్న శని దోషం తొలగిపోతుందని విశ్వసిస్తుంటారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…