Teenmar Mallanna : ఓ జ్యోతిష్యున్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడన్న ఆరోపణలతో క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయగా.. ఆయన గత 2 నెలలుగా జైలులో ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
ఓ కేసులో అరెస్టు అయినప్పటికీ ఆయనకు అందుబాటులో బెయిల్ లభించినా.. ఆయన మీద వరుసగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన ఒక్కో కేసులో బెయిల్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే 2 నెలలుగా జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు చివరి కేసుకు కూడా బెయిల్ రావడంతో విడుదల కానున్నారు. సోమవారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే జైలులో ఉన్నప్పుడే మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తమ భర్తను రక్షించాలని కోరుతూ ఆయన భార్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఎన్నికలు అయిపోయే వరకు మల్లన్నను కావాలనే జైలులో ఉంచారని బీజేపీ నేతలతోపాటు అటు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే హుజురాబాద్ ఎన్నికలు అయ్యాక ఆయనపై కొత్త కేసులేవీ పెట్టలేదు. దీంతో ఉన్న కేసులకు బెయిల్ క్లియర్ అయింది. ఈ క్రమంలోనే మల్లన్న విడుదల కానున్నారు. ఆయన విడుదలవుంతుండడంతో ఆయన అభిమానుల్లో హార్షాతిరేకాలు నెలకొంటున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…