Jabardasth : బుల్లితెరపై కొన్ని సంవత్సరాల నుంచి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా రోజా, నాగబాబు వ్యవహరించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు మధ్యలో వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చారు.
ఇలా జబర్దస్త్ షో నుంచి ఎంతమంది వెళ్లిపోయినా కానీ రోజా మాత్రం అక్కడే పర్మినెంట్ గా తిష్ట వేసుకుని కూర్చున్నారు. అయితే రోజా ఒకవైపు రాజకీయాలలో, మరొకవైపు బుల్లితెర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొన్ని సార్లు రాజకీయ పనులవల్ల ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రోజా స్థానంలో నిర్వాహకులు మరొక జడ్జిని భర్తీ చేస్తూ వస్తున్నారు.
అయితే గత కొద్ది రోజుల క్రితం రోజా తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా జబర్దస్త్ కార్యక్రమానికి కొంత విరామం ఇచ్చారు. ఈ విరామ సమయంలో రోజా స్థానాన్ని నటి ఇంద్రజ ఆక్రమించుకున్నారు. ఇంద్రజ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఇకపై రోజా స్థానంలో ఇంద్రజ పర్మినెంట్ గా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే రోజా మాత్రం తన స్థానాన్ని తను దక్కించుకుంది.
తాజాగా మరోసారి రోజా జబర్దస్త్ కార్యక్రమం నుంచి రోజా మాయమైనట్లు తెలుస్తోంది. రోజా రాజకీయాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. రోజా ఇలాగే కనుక రాజకీయాల్లో బిజీగా ఉంటే తన స్థానాన్ని ఇంద్రజ కైవసం చేసుకోవడం ఖాయం.. అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…