Jabardasth : బుల్లితెరపై కొన్ని సంవత్సరాల నుంచి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా రోజా, నాగబాబు వ్యవహరించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు మధ్యలో వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చారు.
ఇలా జబర్దస్త్ షో నుంచి ఎంతమంది వెళ్లిపోయినా కానీ రోజా మాత్రం అక్కడే పర్మినెంట్ గా తిష్ట వేసుకుని కూర్చున్నారు. అయితే రోజా ఒకవైపు రాజకీయాలలో, మరొకవైపు బుల్లితెర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొన్ని సార్లు రాజకీయ పనులవల్ల ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రోజా స్థానంలో నిర్వాహకులు మరొక జడ్జిని భర్తీ చేస్తూ వస్తున్నారు.
అయితే గత కొద్ది రోజుల క్రితం రోజా తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా జబర్దస్త్ కార్యక్రమానికి కొంత విరామం ఇచ్చారు. ఈ విరామ సమయంలో రోజా స్థానాన్ని నటి ఇంద్రజ ఆక్రమించుకున్నారు. ఇంద్రజ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఇకపై రోజా స్థానంలో ఇంద్రజ పర్మినెంట్ గా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే రోజా మాత్రం తన స్థానాన్ని తను దక్కించుకుంది.
తాజాగా మరోసారి రోజా జబర్దస్త్ కార్యక్రమం నుంచి రోజా మాయమైనట్లు తెలుస్తోంది. రోజా రాజకీయాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. రోజా ఇలాగే కనుక రాజకీయాల్లో బిజీగా ఉంటే తన స్థానాన్ని ఇంద్రజ కైవసం చేసుకోవడం ఖాయం.. అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…