Bhagyashree : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భాగ్యశ్రీ ఫస్ట్ సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 1989 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమాతో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డె. రీసెంట్ గా భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వూలో తాను సినిమాల నుండి ఎక్కువగా విరామం తీసుకోవడానికి కారణాలేంటో వివరించారు. భాగ్యశ్రీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని.. చాలా బాధపడ్డానని, ముఖ్యంగా తన కుడి చేయి కదలడం కష్టంగా ఉండేదని అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చానని అన్నారు. భాగ్యశ్రీ తన ఆరోగ్యం నుండి కోలుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టిందని అన్నారు. ఈ క్రమంలో ఆమె పోషకాహారం, ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేందుకు సమయాన్ని వినియోగించుకున్నానని భాగ్య శ్రీ తెలిపారు.
అలాగే తన ఆరోగ్యం బాగుండేందుకు సర్జరీల్లాంటివి సెలెక్ట్ చేసుకోలేదని, అందుకు బదులుగా తన కష్టపడి పనిచేసి సొంతంగా ట్రీట్ మెంట్ తీసుకోవడంతో కోలుకున్నట్లు తెలిపారు. ఆ టైమ్ లో ఓ టెలివిజన్ షోకి సంబంధించిన ప్రోగ్రామ్ లో తన కుడి చేతిని కదపలేకపోయానని, అలా తను కోలుకోవడానికి సంవత్సరం పట్టిందని అన్నారు. సాధారణమైన జీవన విధానం అనేది మనిషిని క్యూర్ చేయడాన్ని తాను దగ్గరుండి తెలుసుకున్నానని అన్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…