Bhagyashree : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భాగ్యశ్రీ ఫస్ట్ సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 1989 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమాతో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డె. రీసెంట్ గా భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వూలో తాను సినిమాల నుండి ఎక్కువగా విరామం తీసుకోవడానికి కారణాలేంటో వివరించారు. భాగ్యశ్రీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని.. చాలా బాధపడ్డానని, ముఖ్యంగా తన కుడి చేయి కదలడం కష్టంగా ఉండేదని అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చానని అన్నారు. భాగ్యశ్రీ తన ఆరోగ్యం నుండి కోలుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టిందని అన్నారు. ఈ క్రమంలో ఆమె పోషకాహారం, ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేందుకు సమయాన్ని వినియోగించుకున్నానని భాగ్య శ్రీ తెలిపారు.
అలాగే తన ఆరోగ్యం బాగుండేందుకు సర్జరీల్లాంటివి సెలెక్ట్ చేసుకోలేదని, అందుకు బదులుగా తన కష్టపడి పనిచేసి సొంతంగా ట్రీట్ మెంట్ తీసుకోవడంతో కోలుకున్నట్లు తెలిపారు. ఆ టైమ్ లో ఓ టెలివిజన్ షోకి సంబంధించిన ప్రోగ్రామ్ లో తన కుడి చేతిని కదపలేకపోయానని, అలా తను కోలుకోవడానికి సంవత్సరం పట్టిందని అన్నారు. సాధారణమైన జీవన విధానం అనేది మనిషిని క్యూర్ చేయడాన్ని తాను దగ్గరుండి తెలుసుకున్నానని అన్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…