Sri Reddy : టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్, మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా పూరీ చేతిలో పడితే ఆటం బాంబ్ లా మారిపోతాడు. సిల్వర్ స్క్రీన్ పై డైరెక్టర్ పేరు పడితే విజిల్స్ పడేది ఒక్క పూరీకి మాత్రమే. పూరీ సినిమాలో హీరో చెప్పే ఒక్కో డైలాగ్ ను యూత్ అంతా ఓన్ చేసుకొని మన గురించే రాశాడురా అని ఫీల్ అవుతారు. హీరోకి ఏ మాత్రం తగ్గని కట్ ఔట్స్ థియేటర్ల ముందు దర్శనిమిస్తాయి. ఈ స్టార్ డైరెక్టర్తో సినిమాలు చేయాలని ఒకప్పుడు స్టార్ హీరోలందరూ క్యూ కట్టారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఒక్క సినిమాతో తారు మారైంది. ఆ సినిమానే లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్న పూరీ జగన్నాథ్ ఆశలకు గండి పడింది. ఈ గురువారం విడుదలైన లైగర్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
లైగర్ మూవీని చూశాక నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్, మీమ్స్తో విరుచుకు పడుతున్నారు. విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరోగా చూడాలనుకున్న ఆయన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. డైరెక్టర్ పూరీని నెటిజన్స్ సహా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరైతే బూతులు తిడుతున్నారు. ప్రమోషన్స్ పై పెట్టిన శ్రద్ధ మూవీపై పెట్టుంటే బాగుండని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి తనదైన శైలిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై ఘాటు, హాటు కామెంట్స్ చేసింది.
లైగర్ మూవీ రిజల్ట్ పై పూరీ జగన్నాథ్ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వటం లేదు, అని బాబు మీద పడి ఏడవటం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా.. అని ఒక ట్వీట్, లైగర్కి ముందు లైగర్ తర్వాత అంట.. అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ వున్నోడికి హైప్ అవసరం లేదు, లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం అంటూ మరో ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. ఆల్రెడీ అనసూయ చేసిన ట్వీట్ కే అనసూయను ఓ ఆటాడుకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ శ్రీరెడ్డి ట్వీట్ కి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…