Sri Reddy : టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్, మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా పూరీ చేతిలో పడితే ఆటం బాంబ్ లా మారిపోతాడు. సిల్వర్ స్క్రీన్ పై డైరెక్టర్ పేరు పడితే విజిల్స్ పడేది ఒక్క పూరీకి మాత్రమే. పూరీ సినిమాలో హీరో చెప్పే ఒక్కో డైలాగ్ ను యూత్ అంతా ఓన్ చేసుకొని మన గురించే రాశాడురా అని ఫీల్ అవుతారు. హీరోకి ఏ మాత్రం తగ్గని కట్ ఔట్స్ థియేటర్ల ముందు దర్శనిమిస్తాయి. ఈ స్టార్ డైరెక్టర్తో సినిమాలు చేయాలని ఒకప్పుడు స్టార్ హీరోలందరూ క్యూ కట్టారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఒక్క సినిమాతో తారు మారైంది. ఆ సినిమానే లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్న పూరీ జగన్నాథ్ ఆశలకు గండి పడింది. ఈ గురువారం విడుదలైన లైగర్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
లైగర్ మూవీని చూశాక నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్, మీమ్స్తో విరుచుకు పడుతున్నారు. విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరోగా చూడాలనుకున్న ఆయన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. డైరెక్టర్ పూరీని నెటిజన్స్ సహా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరైతే బూతులు తిడుతున్నారు. ప్రమోషన్స్ పై పెట్టిన శ్రద్ధ మూవీపై పెట్టుంటే బాగుండని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి తనదైన శైలిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై ఘాటు, హాటు కామెంట్స్ చేసింది.
లైగర్ మూవీ రిజల్ట్ పై పూరీ జగన్నాథ్ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వటం లేదు, అని బాబు మీద పడి ఏడవటం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా.. అని ఒక ట్వీట్, లైగర్కి ముందు లైగర్ తర్వాత అంట.. అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ వున్నోడికి హైప్ అవసరం లేదు, లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం అంటూ మరో ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. ఆల్రెడీ అనసూయ చేసిన ట్వీట్ కే అనసూయను ఓ ఆటాడుకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ శ్రీరెడ్డి ట్వీట్ కి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…