Anasuya : జబర్దస్త్ ఫేమ్ అనసూయ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను చెప్పడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. మహిళలను కించ పరిచే వారిని ట్విట్టర్ లో ఘాటైన పోస్టులతో విమర్శించడంలో ముందుంటుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో తనను హింసించే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే తనను ట్విట్టర్ లో ఆంటీ అని కామెంట్ చేస్తూ, కారణం లేకుండా తనని అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్న వారి పోస్టుల స్క్రీన్ షాట్ తీసిన ఆమె వారందరిపై కేసు నమోదు చేస్తానని, ఆ తర్వాత తన జోలికి వచ్చినందుకు వారు పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది.
అయితే అంతకుముందు ఆమె లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా.. అని ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ ను పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయన చేసిన వాఖ్యలకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నట్టుగా ఆమె చేసిన ట్వీట్ వలన ఈ వివాదం మొదలైంది.
దీనిపై సోషల్ మీడియాలో అనసూయకు వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు బయటకు లాగి దాన్ని లైగర్ సినిమా ఫ్లాప్ తో ముడిపెట్టడం, తోటి సినిమా వాళ్లు బాధ పడుతుంటే ఆనందించడం ఏంటని ట్విట్టర్ లో అనసూయను ఆంటీ అని ఇంకా రకరకాలుగా కామెంట్ చేస్తూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
అయితే ఇలా తనను అకారణంగా ఏజ్ షేమింగ్ చేస్తూ మాటలతో హింసించే వారిపై లీగల్ చర్యలు తీసుకోవడానికి సైబర్ సెల్ తో మాట్లాడినట్లుగా చెబుతూ ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే విషయం గురించి చర్చిస్తున్నట్టుగా, వారు తనకు హామీ ఇచ్చారని ట్వీట్ చేసింది. అయితే ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…