Anasuya : జబర్దస్త్ ఫేమ్ అనసూయ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను చెప్పడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. మహిళలను కించ పరిచే వారిని ట్విట్టర్ లో ఘాటైన పోస్టులతో విమర్శించడంలో ముందుంటుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో తనను హింసించే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే తనను ట్విట్టర్ లో ఆంటీ అని కామెంట్ చేస్తూ, కారణం లేకుండా తనని అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్న వారి పోస్టుల స్క్రీన్ షాట్ తీసిన ఆమె వారందరిపై కేసు నమోదు చేస్తానని, ఆ తర్వాత తన జోలికి వచ్చినందుకు వారు పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది.
అయితే అంతకుముందు ఆమె లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా.. అని ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ ను పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయన చేసిన వాఖ్యలకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నట్టుగా ఆమె చేసిన ట్వీట్ వలన ఈ వివాదం మొదలైంది.
దీనిపై సోషల్ మీడియాలో అనసూయకు వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు బయటకు లాగి దాన్ని లైగర్ సినిమా ఫ్లాప్ తో ముడిపెట్టడం, తోటి సినిమా వాళ్లు బాధ పడుతుంటే ఆనందించడం ఏంటని ట్విట్టర్ లో అనసూయను ఆంటీ అని ఇంకా రకరకాలుగా కామెంట్ చేస్తూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
అయితే ఇలా తనను అకారణంగా ఏజ్ షేమింగ్ చేస్తూ మాటలతో హింసించే వారిపై లీగల్ చర్యలు తీసుకోవడానికి సైబర్ సెల్ తో మాట్లాడినట్లుగా చెబుతూ ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే విషయం గురించి చర్చిస్తున్నట్టుగా, వారు తనకు హామీ ఇచ్చారని ట్వీట్ చేసింది. అయితే ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…