Chaddannam : పెద్దల మాట చద్దన్నం మూట అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే పెద్దలు ఎప్పుడూ మన మంచిని కోరుకుంటారు అని ఈ సామెత అర్థం. ఇప్పుడు మారుతున్న జీవనశైలిని బట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అంటూ ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా అంటూ నాలుకకు రుచిగా అనిపించే పదార్థాలను తింటున్నాం. కానీ మన పూర్వకాలంలో పెద్దలకు బ్రేక్ ఫాస్ట్ అంటేనే తెలియదు. వాళ్లకు బ్రేక్ ఫాస్ట్ ఉదయాన్నే చద్దన్నం తినడం. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ చద్దన్నం ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అందుకే పూర్వం పెద్దవాళ్లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దాదాపు వంద ఏళ్ళ వరకు జీవించేవారు. రాత్రి వండిన అన్నంలో పెరుగు వేసి బాగా కలిపి దానిలో ఒక ఉల్లిపాయ ముక్క వేసి ఉదయం వరకూ ఉంచితే దానినే చద్దన్నం అంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ చద్దన్నం తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మరి చద్దన్నం తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.
చద్దన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా అందుతుంది. కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎప్పుడూ నీరసంగా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు చద్దన్నం తినడం వల్ల జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. పేగు సంబంధిత సమస్యలు, అల్సర్స్ తో బాధపడుతున్నవారికి చద్దన్నం పరమౌషధంగా పనిచేస్తుంది.
చద్దన్నంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల కడుపు నిండుగా అయిన భావన కలిగి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరానికి శక్తిని అందించి అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. కనుక రోజూ చద్దన్నాన్ని తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…