Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్డేట్స్ను పోస్ట్ చేస్తోంది. అయితే సమాజంలోని సంఘటనలపై ఈమె ఈమధ్య పెద్దగా స్పందించడం లేదు. ఇటీవలే నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తరువాత నటి కల్యాణి వివాదంపై స్పందించింది. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది. తరువాత ఎవరిపై కూడా పెద్దగా కామెంట్స్ చేయలేదు. కానీ తన వంటల వీడియోలతో మాత్రం అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు నాన్ వెజ్ వంటకాలను వండుతూ అలరిస్తోంది. ఇక తాజాగా మరో వంటకంతో శ్రీరెడ్డి నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి తన లేటెస్ట్ వీడియోలో బోటికూర వండింది. తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ.. బోటిని క్లీన్ చేసింది. తరువాత దాన్ని యమ ఘాటుగా వండింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే భారీగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈమధ్య కాలంలో శ్రీరెడ్డి రెస్టారెంట్లకు సైతం వెళ్తోంది. అక్కడ వంటలను రుచి చూస్తూ రివ్యూలు కూడా ఇస్తోంది. ఓ రెస్టారెంట్కు ఈమె 10 కి 10 మార్కులు ఇవ్వగా.. ఇంకో రెస్టారెంట్కు 6 మార్కులే ఇచ్చింది. అలాగే నగల దుకాణానికి వెళ్లి ఇటీవలే భారీగానే బంగారాన్ని కొనుగోలు చేసింది.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. పైగా పవన్ ను ఎప్పటికప్పుడు తిడుతుండడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి తనకు ముప్పు ఉందని భావించిన ఆమె చెన్నైలో ఉంటోంది. అక్కడి నుంచే వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ మధ్యే చెన్నైలోని ఓ యూట్యూబ్ చానల్తో కలిసి అర్థరాత్రి రహదారులపై ద్విచక్ర వాహనాలను ఆపి హల్ చల్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్గా ఈమె పెట్టిన బోటి కూర వీడియో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు అద్భుతంగా కూర వండావని ఆమెను అభినందిస్తున్నారు. ఆ కూరను చూస్తుంటే తమకు కూడా తినాలని ఉందని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…