Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్డేట్స్ను పోస్ట్ చేస్తోంది. అయితే సమాజంలోని సంఘటనలపై ఈమె ఈమధ్య పెద్దగా స్పందించడం లేదు. ఇటీవలే నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తరువాత నటి కల్యాణి వివాదంపై స్పందించింది. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది. తరువాత ఎవరిపై కూడా పెద్దగా కామెంట్స్ చేయలేదు. కానీ తన వంటల వీడియోలతో మాత్రం అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు నాన్ వెజ్ వంటకాలను వండుతూ అలరిస్తోంది. ఇక తాజాగా మరో వంటకంతో శ్రీరెడ్డి నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి తన లేటెస్ట్ వీడియోలో బోటికూర వండింది. తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ.. బోటిని క్లీన్ చేసింది. తరువాత దాన్ని యమ ఘాటుగా వండింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే భారీగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈమధ్య కాలంలో శ్రీరెడ్డి రెస్టారెంట్లకు సైతం వెళ్తోంది. అక్కడ వంటలను రుచి చూస్తూ రివ్యూలు కూడా ఇస్తోంది. ఓ రెస్టారెంట్కు ఈమె 10 కి 10 మార్కులు ఇవ్వగా.. ఇంకో రెస్టారెంట్కు 6 మార్కులే ఇచ్చింది. అలాగే నగల దుకాణానికి వెళ్లి ఇటీవలే భారీగానే బంగారాన్ని కొనుగోలు చేసింది.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. పైగా పవన్ ను ఎప్పటికప్పుడు తిడుతుండడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి తనకు ముప్పు ఉందని భావించిన ఆమె చెన్నైలో ఉంటోంది. అక్కడి నుంచే వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ మధ్యే చెన్నైలోని ఓ యూట్యూబ్ చానల్తో కలిసి అర్థరాత్రి రహదారులపై ద్విచక్ర వాహనాలను ఆపి హల్ చల్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్గా ఈమె పెట్టిన బోటి కూర వీడియో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు అద్భుతంగా కూర వండావని ఆమెను అభినందిస్తున్నారు. ఆ కూరను చూస్తుంటే తమకు కూడా తినాలని ఉందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…