Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్డేట్స్ను పోస్ట్ చేస్తోంది. అయితే సమాజంలోని సంఘటనలపై ఈమె ఈమధ్య పెద్దగా స్పందించడం లేదు. ఇటీవలే నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తరువాత నటి కల్యాణి వివాదంపై స్పందించింది. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది. తరువాత ఎవరిపై కూడా పెద్దగా కామెంట్స్ చేయలేదు. కానీ తన వంటల వీడియోలతో మాత్రం అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు నాన్ వెజ్ వంటకాలను వండుతూ అలరిస్తోంది. ఇక తాజాగా మరో వంటకంతో శ్రీరెడ్డి నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి తన లేటెస్ట్ వీడియోలో బోటికూర వండింది. తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ.. బోటిని క్లీన్ చేసింది. తరువాత దాన్ని యమ ఘాటుగా వండింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే భారీగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈమధ్య కాలంలో శ్రీరెడ్డి రెస్టారెంట్లకు సైతం వెళ్తోంది. అక్కడ వంటలను రుచి చూస్తూ రివ్యూలు కూడా ఇస్తోంది. ఓ రెస్టారెంట్కు ఈమె 10 కి 10 మార్కులు ఇవ్వగా.. ఇంకో రెస్టారెంట్కు 6 మార్కులే ఇచ్చింది. అలాగే నగల దుకాణానికి వెళ్లి ఇటీవలే భారీగానే బంగారాన్ని కొనుగోలు చేసింది.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. పైగా పవన్ ను ఎప్పటికప్పుడు తిడుతుండడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి తనకు ముప్పు ఉందని భావించిన ఆమె చెన్నైలో ఉంటోంది. అక్కడి నుంచే వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ మధ్యే చెన్నైలోని ఓ యూట్యూబ్ చానల్తో కలిసి అర్థరాత్రి రహదారులపై ద్విచక్ర వాహనాలను ఆపి హల్ చల్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్గా ఈమె పెట్టిన బోటి కూర వీడియో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు అద్భుతంగా కూర వండావని ఆమెను అభినందిస్తున్నారు. ఆ కూరను చూస్తుంటే తమకు కూడా తినాలని ఉందని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…