Samantha : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో సమంత చేసిన ఊ.. అంటావా.. పాటకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. చాలా మంది ఈ పాటకు ఇప్పటికే స్టెప్పులు వేసి తమ సరదాను తీర్చుకున్నారు. ఎంతో మంది సెలబ్స్ కూడా ఈ పాటకు డ్యాన్స్లు చేశారు. అయితే తాజాగా మళ్లీ సమంత ఈ పాటకు స్టెప్పులేసి అలరించింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన డ్యాన్స్ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. ఇక విషయం ఏమిటంటే..
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ఓ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాఫీ విత్ కరణ్ అనే షోకు ఈయన హోస్ట్గా ఉన్నారు. ప్రస్తుతం 7వ సీజన్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్కు తొలి ఎపిసోడ్కు గెస్ట్లుగా రణవీర్ సింగ్, ఆలియా భట్లు వచ్చారు. రెండో ఎపిసోడ్కు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్లు గెస్ట్లుగా వచ్చారు. ఇక గురువారం జూలై 21న మూడో ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సమంత, అక్షయ్ కుమార్లు గెస్ట్లుగా రాగా.. వీరి ఎపిసోడ్కు చెందిన ప్రోమోను లేటెస్ట్గా విడుదల చేశారు. ఇందులోనే సమంత.. అక్షయ్తో కలిసి ఊ.. అంటావా.. పాటకు స్టెప్పులేసి అలరించింది. ఇక ఈ ఎపిసోడ్ ను పూర్తిగా చూడాలంటే గురువారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ను ఓపెన్ చేయాలి. అయితే ఇందులో సమంత కరణ్ జోహార్ వేసే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెబుతుందా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ ధర్మా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో దర్శకుడిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన తెరకెక్కిస్తున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీలో రణవీర్ సింగ్, ఆలియా భట్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2023లో వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…