Sri Reddy : తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ విషయం నేషనల్ మీడియాలోనూ అప్పట్లో వచ్చింది. ఆ తరువాత అంతా సద్దుమణిగింది. అయినప్పటికీ శ్రీరెడ్డి మాత్రం సమాజంలో జరిగే సంఘటనలపై స్పందించడం మానడం లేదు. ఇప్పుడు ఈమె ఓ వైపు యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూనే మరోవైపు మన చుట్టూ జరిగే సంఘటనలపై స్పందిస్తోంది. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో యూట్యూబ్లో వంటల వీడియోలతో రచ్చ చేస్తోంది.
శ్రీరెడ్డి యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అనేక వంటలకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తున్న ఈమె యూట్యూబ్లో కూడా బాగా పాపులర్ అవుతోంది. ఈమె పోస్ట్ చేస్తున్న వంటల వీడియోలకు అనేక వ్యూస్ కూడా వస్తున్నాయి. అయితే ఎప్పుడూ వంటల వీడియోలను పోస్ట్ చేసే ఈమె.. లేటెస్ట్గా అలాంటి వీడియోను కాకుండా.. తానే రెస్టారెంట్కు వెళ్లి స్వయంగా వంట రుచి చూసి అది ఎలా ఉందో చెప్పింది.
ఎల్లప్పుడూ యూట్యూబ్లో వంటల వీడియోలతో సందడి చేసే శ్రీరెడ్డి ఈసారి మాత్రం కాస్త వెరైటీగా చేసింది. ఓ రెస్టారెంట్కు వెళ్లి అక్కడ ఫుడ్ను ఆర్డర్ చేసి బాగా భోజనం చేసినట్లు చెప్పింది. అయితే ఆ రెస్టారెంట్ ఫుడ్కు మాత్రం ఆమె 10 కి 6 మార్కులే ఇస్తున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది. అయితే శ్రీరెడ్డి ఎప్పుడూ వంటలు చేస్తుంది కానీ ఈసారి కాస్త భిన్నంగా ఫుడ్కు రివ్యూ ఇవ్వడంపై నెటిజన్లు షాకవుతున్నారు. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతానికైతే వివాదాలకు దూరంగా తన పనేదో తాను చేసుకుంటూ జీవిస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…