Shriya Saran : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అతను దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం నువ్వే నువ్వే. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 వ సంవత్సరం అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓ తండ్రికి, కూతురికి మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్.. అయితే కూతురి ప్రేమ వల్ల వీరి మధ్య ఏర్పడిన సమస్యల చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో, అద్భుతమైన డైలాగులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు టీమ్. ఈ సందర్భంగా ఈవెంట్ లో హీరో తరుణ్ తో పాటు శ్రియా, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సదర్భంగా శ్రియా మాట్లాడుతూ.. ఇంత మంచికథను అందించి.. మంచి సినిమాను మాతో తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఇక ప్రకాశ్ రాజ్ నిజంగా నా పేరెంట్స్ ను మరిపించారు. మీతో నటించడం నాకు గౌరవంగా ఫీల్ అవుతున్నాను అన్నారు శ్రియ. ఈ క్రమంలోనే హీరో తరుణ్ ను ఆకాశానికెత్తింది శ్రియ. తను అమేజింగ్ కో ఆర్టిస్ట్ అని పొగడ్తలతో ముంచెత్తింది.
అందరూ చూస్తుండగానే తరుణ్ ను గాఢంగా ముద్దాడింది శ్రియ. ఈ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇక తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిన్న మొన్న చేసినట్టుంది. అప్పుడే 20 ఏళ్లు అయ్యాయంటే నమ్మబుద్ది కావడం లేదు అన్నాడు. హీరోగా నా ఫస్టు మూవీకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గా ఆయన ఫస్టు సినిమాకి హీరోగా నేను చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్టు హీరో మాత్రం నేనే. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే, నువ్వే నువ్వే లాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…