Shriya Saran : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అతను దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం నువ్వే నువ్వే. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 వ సంవత్సరం అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓ తండ్రికి, కూతురికి మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్.. అయితే కూతురి ప్రేమ వల్ల వీరి మధ్య ఏర్పడిన సమస్యల చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో, అద్భుతమైన డైలాగులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు టీమ్. ఈ సందర్భంగా ఈవెంట్ లో హీరో తరుణ్ తో పాటు శ్రియా, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సదర్భంగా శ్రియా మాట్లాడుతూ.. ఇంత మంచికథను అందించి.. మంచి సినిమాను మాతో తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఇక ప్రకాశ్ రాజ్ నిజంగా నా పేరెంట్స్ ను మరిపించారు. మీతో నటించడం నాకు గౌరవంగా ఫీల్ అవుతున్నాను అన్నారు శ్రియ. ఈ క్రమంలోనే హీరో తరుణ్ ను ఆకాశానికెత్తింది శ్రియ. తను అమేజింగ్ కో ఆర్టిస్ట్ అని పొగడ్తలతో ముంచెత్తింది.
అందరూ చూస్తుండగానే తరుణ్ ను గాఢంగా ముద్దాడింది శ్రియ. ఈ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇక తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిన్న మొన్న చేసినట్టుంది. అప్పుడే 20 ఏళ్లు అయ్యాయంటే నమ్మబుద్ది కావడం లేదు అన్నాడు. హీరోగా నా ఫస్టు మూవీకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గా ఆయన ఫస్టు సినిమాకి హీరోగా నేను చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్టు హీరో మాత్రం నేనే. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే, నువ్వే నువ్వే లాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…