Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్తో అభిమానులకు కనువిందు చేస్తోంది. నటనతో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంతుంది. జాన్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. అయినా సరే ఇండస్ట్రీలో నెపొటిజం పేరుతో ట్రోల్స్ తప్పడం లేదు జాన్వీకి.
రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ ఈ విధంగా మాట్లాడింది. చాలామందికి నా గురించి దురభిప్రాయం ఉంది. నేను వారసత్వంతో వచ్చి.. స్టార్ డమ్ పొందాలి అని అనుకోవడం లేదని.. అయినా తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. కాకపోతే.. తాను షూటింగ్ కు వెళ్తే సెట్స్ లో కష్టపడి పని చేస్తానని అంటోంది జాన్వీ. తను కష్టపడే తత్వమే తనను ఇండస్ట్రీలో నిలబెడుతుందని నమ్ముతున్నానంటోంది. సెట్ లో తాను ఎంత కష్టపడతాను అనేది రక్తంతో రాసివ్వడానికి కూడా వెనకాడనంటోంది.
తనకు అదే పనిని మళ్లీ, మళ్లీ చేయడం బోర్ అని చెబుతూ.. తనకంటూ సవాళ్లను పెట్టుకోవాలని లేదంటే, సమయం వృథా అవుతుందని అనిపిస్తోందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది జాన్వీ కపూర్. ఆమె సౌత్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని, విజయ్ దేవరకొండ జోడీగా నటించబోతుందంటూ.. రకరకాల మాటలు వినిపించాయి కానీ జాన్వీ కపూర్ తో పాటు ఫ్యామిలీ కూడా ఇంత వరకు ఏదీ స్పందించలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…