ప్రస్తుతం బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ తనయుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ అధికారులు మెరుపుదాడి చేసి పలు రకాల నిషేధిత డ్రగ్స్తోపాటు ఆర్యన్ ఖాన్, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉండనున్నాడు. అయితే ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ అరెస్ట్పై చర్చలు నడుస్తున్న సమయంలో పాత సంఘటనని తెరపైకి తేగా ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. కోల్కతా నైట్ రైడర్స్కి యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ పార్టీ ఏర్పాటు చేయగా, దానికి హాజరైన షెర్లిన్ అక్కడ ఏం జరిగిందో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయి వాష్రూమ్కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను.
బాలీవుడ్ స్టార్స్ భార్యలు అందరూ అద్దాల ముందు నిలుచొని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు తీసుకునేది డ్రగ్స్ అని అర్ధం కావడంతో వెంటనే షారూఖ్, అతని స్నేహితులకి గుడ్ బై చెప్పి వెళ్లాను. బాలీవుడ్లో జరిగే పార్టీల గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది’ అని షెర్లిన్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. కాగా, క్రూయిజ్ షిప్పై జరిపిన దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5 గ్రాముల ఎండీ లభించాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది.
బట్టలు, లోదుస్తులు, పర్సులలో డ్రగ్స్ దాచినట్టుగా సమాచారం. ఆర్యన్ ఖాన్ను ప్రశ్నించడానికి అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉండాలని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని ఎన్సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…