హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో దేవీ నవరాత్రులను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే నవరాత్రులలో నేడు మొదటిరోజు కావడంతో అమ్మవారు మనకు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు.
నవరాత్రి మొదటి రోజులో భాగంగా అమ్మవారికి ఏ విధమైన వస్త్రాలను సమర్పించాలి. ఎలాంటి నైవేద్యం పెట్టాలి ? ఏ విధమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శైలపుత్రిగా రెండు సంవత్సరాల బాలిక రూపంలో పూజిస్తాము. అమ్మవారికి నేడు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. అదేవిధంగా మల్లెపువ్వులు, జాజిపువ్వులతో అమ్మవారికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అదేవిధంగా మొదటిరోజు నైవేద్యంగా అమ్మవారికి పొంగలి సమర్పించాలి.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు చేసేవారు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేయాలి. కలశం ముందు అఖండ దీపం వెలిగించిన వారు ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. నేడు పూజ చేయడానికి ఉదయం 10:30 నుంచి 12, సాయంత్రం 6:00 నుంచి 7:30 గంటల వరకు ఎంతో అనువైన సమయం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…